
విద్యాభివృద్ధికి తిరోగమన చర్య
పాఠశాలల పర్యవేక్షణ బాధ్యతను ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లకు అప్పగించడం సరైంది కాదు. విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెట్టి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులను ప్రైవేట్ వైపు మళ్లించడానికి చేస్తున్న చర్యగానే చూడాలి. ఎందుకంటే పాఠశాలల్లో పని చేస్తున్న ఎస్జీటీలను, స్కూల్ అసిస్టెంట్లను పర్యవేక్షణ అధికారులుగా నియమించి అక్కడ విద్యాబోధన చేయడానికి టీచర్లు లేకుండా చేయడమే. దాంతో పిల్లలు ప్రైవేట్ వైపు మొగ్గు చూపుతారు. అంతేగాక ఒకే స్థాయి ఉన్న టీచర్ల మీదనే కాకుండా గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల మీద పర్యవేక్షణ చేయడం ద్వారా విద్యా వ్యవస్థ మరింత దిగజారడానికి కారణమవుతుంది. అనాలోచిత చర్యలను విరమించుకొని పర్యవేక్షణ అధికారులైన ఎంఈఓలను, డిప్యూటీ డీఈఓలను, రెగ్యులర్ డీఈఓలను నియమించాలి. – పబ్బతి వెంకటేశ్వర్లు, డీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు