
రెగ్యులర్ ప్రాతిపదికన ఉంటే ఇంకా బాగుంటుంది
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పీఆర్టీయూ ఎప్పుడూ సమర్థిస్తుంది. పాఠశాలల్లో పర్యవేక్షణ ఉండడం ఆహ్వానించదగ్గ పరిణామమే. దీని ద్వారా మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ పర్యవేక్షణ రెగ్యులర్ అధికారుల పోస్టులను భర్తీ చేయడం ద్వారా చేస్తే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. విద్యా ప్రమాణాలు కూడా పెరగడానికి దోహద పడుతుంది. సర్వీసు రూల్స్ రూపకల్పన చేసి రెగ్యులర్ డీఈఓ, డిప్యూటీ డీఈఓ, మండల విద్యాధికారుల పోస్టులను రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
– తంగెళ్ల జితేందర్రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు
●