ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత వైఎస్సార్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత వైఎస్సార్‌

Jun 24 2025 3:22 AM | Updated on Jun 24 2025 3:22 AM

ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత వైఎస్సార్‌

ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత వైఎస్సార్‌

కోదాడరూరల్‌ : అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో నిలిచిన మహానేత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి అని ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి కొనియాడారు. సోమవారం కోదాడ పట్టణ పరిధిలోని గుడిబండ రోడ్డులో గల గోపిరెడ్డినగర్‌ వద్ద రైతుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆమె ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. వైఎస్సార్‌ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్‌, రాజీవ్‌ఆరోగ్య శ్రీ, ఫీజురీయింబర్స్‌మెంట్‌, 108, వికలాంగులు, వృద్ధులకు పింఛన్‌ల వంటి అనేక సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. ఆ పథకాలతోనే కాంగ్రెస్‌ పార్టీని రాష్ట్రంలో రెండో సారి అధికారంలోకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడని అన్నారు. ఆయన ఆశయాలను కాంగ్రెస్‌ పార్టీ సాధిస్తుందని తెలిపారు. విగ్రహం ఏర్పాటు చేసినవారిని ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ సభ్యుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ వంగవీటి రామారావు, మాజీ కౌన్సిలర్‌లు కందుల కోటేశ్వరరావు, కొల్లా లక్ష్మీప్రసన్న కొటిరెడ్డి, వాచేపల్లి వెంకటేశ్వరరెడ్డి, అంచూరి వెంకట్‌రెడ్డి, పిన్నపురెడ్డి వీరారెడ్డి, కొనగళ్ల నారాయణరెడ్డి, రెడ్డిమళ్ల వెంకట్‌రెడ్డి, గాయం బ్రహ్మారెడ్డి ఉన్నారు.

ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement