
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో నిత్యకల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఆలయంలో సుప్రభాత సేవ, నిత్యహోమం, పంచామృతాభిషేకం, ఎదుర్కోళ్లమహోత్సవ సంవాదం చేపట్టారు. కల్యాణవేడుకలో భాగంగా విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలు తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గరుడవాహనంపై శ్రీస్వామివారిని ఆలయ తిరుమాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం మహానివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. కాగా క్షేత్రంలోని శివాలయంలోగల శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామికి ఏకా దశ రుద్రాభిషేకం నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్ కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్కుమార్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, పద్మనాభా చార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, దుర్గాప్రసాద్శర్మ పాల్గొన్నారు.
ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా సుధాకర్
సూర్యాపేట : ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా బత్తుల సుధాకర్ ఎన్నికయ్యారు. ఈనెల 21, 22 తేదీలో ఖమ్మం పట్టణంలో నిర్వహించిన స్టాఫ్వర్కర్స్ ఫెడరేషన్ 4వ రాష్ట్ర మహాసభలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని విమర్శించారు. కార్మిక వర్గం ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు.
దేశ సమగ్రతకు కృషి చేసిన విద్యావేత్త శ్యామ్ప్రసాద్
తాళ్లగడ్డ(సూర్యాపేట): దేశ సమగ్రత కోసం కృషి చేసిన విద్యావేత్త డాక్టర్ శ్యామ్ప్రసాద్ ముఖర్జీ అని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి కొనియాడారు. సోమవారం బీజేపీ జిల్లా కార్యాలయంలో శ్యామ్ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బూర శకుంతల ఆధ్వర్యంలో స్థానిక రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మొక్కల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కలకత్తా విశ్వవిద్యాలయానికి వైస్ చాన్స్లర్గా నియమితులై విద్యారంగంలో నూతనోత్సాహాన్ని తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్ బూర మల్సూర్గౌడ్, జల్లా జనార్దన్, బీజేపీ నాయకులు కడియం రామచంద్రయ్య, జుట్టుకొండ సత్యనారాయణ, చల్లమల నరసింహ, రుక్మారావు, మన్మథరెడ్డి, గజ్జల వెంకటరెడ్డి, మహేష్, లింగారెడ్డి, కాశయ్య, ఫణినాయుడు, రవి, తాళ్ల నరేందర్రెడ్డి, శోభారెడ్డి, మౌనిక, దాసరి వెంకన్న, బైరు విజయ్కృష్ణ, వర్మ, గణేష్ పాల్గొన్నారు.

మట్టపల్లిలో నిత్యకల్యాణం

మట్టపల్లిలో నిత్యకల్యాణం