ఉపాధ్యాయులకు తనిఖీల బాధ్యతలు అప్పగించొద్దు | - | Sakshi
Sakshi News home page

ఉపాధ్యాయులకు తనిఖీల బాధ్యతలు అప్పగించొద్దు

Jun 23 2025 6:18 AM | Updated on Jun 23 2025 6:18 AM

ఉపాధ్యాయులకు తనిఖీల బాధ్యతలు అప్పగించొద్దు

ఉపాధ్యాయులకు తనిఖీల బాధ్యతలు అప్పగించొద్దు

సూర్యాపేటటౌన్‌ : రాష్ట్రంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పనితీరును పర్యవేక్షించడానికి ఎస్జీటీ, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయులను పర్యవేక్షణ అధికారులుగా నియమించి బాధ్యతలు అప్పగించడం సరికాదని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పబ్బతి వెంకటేశ్వర్లు, వేణు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని నంబర్‌– 2 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఓ వైపు ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో విద్యా ప్రమాణాలకు చర్యలు తీసుకుంటామని చెబుతూనే ఇలాంటి చర్యలకు తీసుకోవడం అనాలోచితమైన చర్యగా పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్ర ఆడిట్‌ కమిటీ సభ్యుడు సీహెచ్‌ వెంకటేశ్వర్లు, జిల్లా ఉపాధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, రమణ, సింహాద్రి, క్రాంతి కుమార్‌, వెంకటయ్య, యాదగిరి, లింగయ్య, ప్రభాకర్‌, దేవేందర్‌, నాగన్న పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement