ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి

Jun 23 2025 5:28 AM | Updated on Jun 23 2025 6:16 AM

మోత్కూరు : ఉచిత పథకాల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని బీజేపీ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి, తుంగతుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ కడియం రామచంద్రయ్య పిలుపునిచ్చారు. ప్రధానిగా నరేంద్రమోదీ 11 ఏళ్లు పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా మోత్కూరు మండలంలోని పాటిమట్ల గ్రామంలో బీజేపీ మండల అధ్యక్షుడు గూదె మధుసూదన్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో ఆదివారం సంకల్ప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏ ఒక్క అవినీతి మచ్చ లేకుండా పాలన కొనసాగిస్తూ రాష్ట్రాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికార దాహంతో ప్రజలను అభివృద్ధికి దూరం చేస్తూ ఉచితాల పేరుతో ప్రజలను మోసం చేస్తోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని కోరారు. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి గ్రామంలో మొక్కలు నాటారు. అదేవిధంగా గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో చేరారు. సమావేశంలో జిల్లా నాయకులు ఏనుగు జితేందర్‌రెడ్డి, అండెం సుధాకర్‌రెడ్డి, భీముడి తిరుమలరెడ్డి, ఉపాధ్యక్షులు లెల్లల బాలనర్సయ్య, రాదారపు మల్లేషం, ప్రధాన కార్యదర్శి వేముల దశరథ, మండల ఎస్సీ మోర్చా కొంపెల్లి గణేష్‌, కోశాధికారి కడమంచి సైదులు, కార్యదర్శి బత్తిని సతీష్‌, గ్రామ శాఖ అధ్యక్షులు ఈట్టబోయిన ఆంజనేయులు, నల్లపోగుల వెంకన్న, కక్కరేను మల్లేష్‌, ముక్కాముల గణేష్‌, ఆళ్ల శివప్రసాద్‌, నిలిగొండ జయమ్మ, మార్గం సుజాత, మహేశ్వరం నిఖిత, కల్పన, మహేష్‌, మచ్చగిరి, నరేష్‌, అజయ్‌, మత్స్యగిరి, కిరణ్‌, మౌలానా పాల్గొన్నారు.

ఫ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు

చల్లా శ్రీలతారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement