
తాగి నడిపితే జైలుకే!
సూర్యాపేటటౌన్ : మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తాగి నడిపేవారిని ఎక్కడికక్కడ కట్టడి చేసేందుకు కృషి చేస్తున్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయకుండా రోడ్డు ప్రమాదాల నివారణకు పాటు పడాలని పోలీసులు అవగాహన కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. అయినా కొంతమంది మత్తులో నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. ఈ ప్రమాదాలను నివారించడమే లక్ష్యంగా జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎక్కడికక్కడ డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. పట్టుబడిన వారికి జరిమానాలతో పాటు జైలు శిక్షలు సైతం విధిస్తున్నారు. ఇటీవల ఎస్పీ పలు పోలీస్ స్టేషన్లకు అత్యాధునిక బ్రీత్ ఎనలైజర్లు పంపిణీ చేశారు.
200 పాయింట్లు దాటితే జైలు శిక్ష
డ్రంకెన్ డ్రైవ్ చేస్తూ పోలీసులకు పట్టుబడిన వారిల్లో ఎక్కువగా యువతే ఉంటున్నారు. ఒక్కోసారి పిల్లలు చేసిన తప్పులకు తల్లిదండ్రులు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. సమాజంలో సైతం చెడు పేరు తెచ్చుకునే పరిస్థితి తలెత్తుతోంది. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన వారికి బ్రీత్ అనలైజర్తో టెస్టులు నిర్వహించి పాయింట్ల ఆధారంగా జరిమానాలు విధిస్తున్నారు. 50 నుంచి 100 పాయింట్ల వరకు రూ.వేయి వరకు జరిమానా, 100 నుంచి 200 పాయింట్లు వస్తే రూ.2వేల జరిమానా విధిస్తున్నారు. 200 పాయింట్లు దాటితే జైలు శిక్ష సైతం పడే అవకాశం ఉంది.
జీవితాలను నాశనం చేసుకోవద్దు
మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల వారితో పాటు ఇతరులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇలాంటి వారు పోలీసుల నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా పూర్తిస్థాయిలో నిఘా ఉంచాం. ప్రమాదాల నివారణకు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నాం. యువత మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దు.
– నరసింహ, ఎస్పీ
ఫ జిల్లాలోని పోలీస్స్టేషన్ల పరిధిలో
విస్తృతంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
ఫ పట్టుబడితే జరిమానాతోపాటు, జైలు శిక్ష
నమోదైన కేసులు ఇలా..
సంవత్సరం కేసులు జైలు శిక్ష
2023 22,875 10
2024 12,940 15
2025(ఇప్పటి వరకు) 7500 30

తాగి నడిపితే జైలుకే!