సాగర్‌లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఏఎస్పీ | - | Sakshi
Sakshi News home page

సాగర్‌లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఏఎస్పీ

May 6 2025 1:24 AM | Updated on May 6 2025 1:24 AM

సాగర్‌లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఏఎస్పీ

సాగర్‌లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఏఎస్పీ

నాగార్జునసాగర్‌: హైదరాబాద్‌లో జరగనున్న మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన పలువురు సుందరీమణులు బుద్ధపూర్ణిమను పురస్కరించుకొని ఈ నెల 12న నాగార్జునసాగర్‌కు రానున్నారు. సాగర్‌లోని బుద్ధవనం, విజయ విహార్‌ అతిథిగృహం ప్రాంతాల్లో వారు పర్యటించనున్న నేపథ్యంలో ఆ ప్రదేశాలను దేవరకొండ ఏఎస్పీ మౌనిక సోమవారం మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్‌రాజు, పోలీస్‌ అధికారులతో కలిసి సందర్శించారు. అనంతరం భద్రతా ఏర్పాట్లపై బుద్ధవనంలోని మహాస్థూపం అంతర్భాగంలో గల సమావేశ మందిరంలో పోలీస్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మౌనిక మాట్లాడుతూ.. భద్రతలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశఽంలో నాగార్జునసాగర్‌ సీఐ శ్రీనునాయక్‌, హాలియా సీఐ జనార్దన్‌గౌడ్‌, హాలియా, సాగర్‌ సర్కిళ్ల పరిధిలోని ఎస్‌ఐలు సంపత్‌గౌడ్‌, వీరశేఖర్‌, వీరబాబు, సతీష్‌రెడ్డి, రమేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement