
‘ఈఏపీ’ పరీక్ష కేంద్రం తనిఖీ
సూర్యాపేటటౌన్ : జిల్లా కేంద్రంలోని శ్రీవేంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఈఏపీ (ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మ) సెట్ పరీక్షా కేంద్రాన్ని శుక్రవారం ఎస్పీ నరసింహ తనిఖీ చేశారు. బందోబస్తును పరిశీలించారు. బందోబస్తు నిర్వహణలో సిబ్బంది పనితీరును కొనియాడారు.
‘సప్లిమెంటరీ’కి విద్యార్థులను సిద్ధం చేయాలి
ఆత్మకూర్ (ఎస్): అధ్యాపకులు ప్రతిరోజూ కళాశాలకు వస్తూ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని డీఐఈఓ భానునాయక్ ఆదేశించారు. శుక్రవారం ఆత్మకూర్ (ఎస్) మండలం నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యాపకులు బాధ్యతగా వ్యవహరించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. నూతన విద్యాసంవత్సరం అడ్మిషన్లపై దృష్టి సారించాలన్నారు. గత ఏడాది కంటే ఉత్తమ ఫలితాలు సాధించినందుకు అధ్యాపకులను అభినందించారు. కళాశాలలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ పెరుమాల యాదయ్య, కాలేజీ అధ్యాపకులు గునగంటి వెంకటేశ్వర్లు, దశరథ, డాక్టర్ అమల, లింగయ్య, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.
మొక్కల సంరక్షణపై శ్రద్ధపెట్టాలి : డీఆర్డీఓ
పెన్పహాడ్: నర్సరీల్లో మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలని డీఆర్డీఓ వీవీ.అప్పారావు నిర్వహకులకు సూచించారు. శుక్రవారం పెన్పహాడ్ మండలం మహ్మదాపురం గ్రామంలో నర్సరీ, ఐకేపీ కొనుగోలు కేంద్రం, అంగన్వాడీ సెంటర్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సరీల్లోని మొక్కలకు రోజూ నీరుపోయాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ట్యాబ్ఎంట్రీ చేసి రైతుల ఖాతాల్లో 48గంటల్లో ధాన్యం డబ్బులు పడేలా చూడాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని మహిళా సమాఖ్య కార్యాలయంలో సెర్ప్ సిబ్బంది, ఉపాధి హామీ, సీ్త్రనిధి సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటేశ్వరరావు, ఏఓ అనిల్కుమార్, సీ్త్రనిధి మేనేజర్ జ్యోతి, ఏపీఎం అజయ్నాయక్, ఏపీఓ రవి, ఈసీమహేష్, వీఓఏ విజయ, రజిని, ఇందిరమ్మ, సుశీల, సీసీ పద్మావతి, సునీత, రమణ పాల్గొన్నారు.
మట్టపల్లి క్షేత్రం వద్ద కృష్ణమ్మకు హారతి
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రం వద్ద జీవనది కృష్ణమ్మకు శుక్రవారం సాయంత్రం అర్చకులు ప్రత్యేక పూజలు చేసి హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీస్వామి అమ్మవార్లను ప్రత్యేక పల్లకీలో మంగళవాయిద్యాలతో ప్రహ్లాద ఘాట్ తరలించారు. అనంతరం ప్రత్యేక హారతి పూజలు నిర్వహించారు. స్వామివారి ఆలయ ప్రవేశానంతరం మహా నివేదనతో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అంతకుముందు ఆలయంలో శ్రీరాజ్యలక్ష్మీచెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు విజయ్కుమార్, మట్టపల్లిరావు, ఈఓ నవీన్, అర్చకులు శ్రీనివాసాచార్యులు, బదరీనారాయణాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, వంశీకృష్ణమాచార్యులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

‘ఈఏపీ’ పరీక్ష కేంద్రం తనిఖీ

‘ఈఏపీ’ పరీక్ష కేంద్రం తనిఖీ