యువత చెడుమార్గంలో పయనించవద్దు : ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

యువత చెడుమార్గంలో పయనించవద్దు : ఎస్పీ

May 1 2025 1:47 AM | Updated on May 1 2025 1:47 AM

యువత చెడుమార్గంలో పయనించవద్దు : ఎస్పీ

యువత చెడుమార్గంలో పయనించవద్దు : ఎస్పీ

నూతనకల్‌: సమాజంలో యువత చెడుమార్గంలో పయనించవద్దని ఎస్పీ నర్సింహ సూచించారు. బుధవారం నూతనకల్‌ మండల పరిధిలోని మిర్యాల గ్రామంలో నిర్వహించిన పోలీసు ప్రజాభరోసా కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సమాజంలో ఉన్నతమైన వారిగా గుర్తింపు పొందడానికి విద్యే ప్రధానమని అన్నారు. కష్టపడి చదువుతూ లక్ష్యాలను సాధించాలని ఆయన కోరారు. గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొన్నప్పుడే అభివృద్ధి పథంలో పయనిస్తాయన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్పించే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారన్నారు. సైబర్‌ మోసాలు, రోడ్డు భద్రత విషయలో అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ పార్థసారథి, సీఐ నర్సింహారావు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ నాగభూషణ్‌రావు, ఏఎస్‌ఐ కోమటిరెడ్డి వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement