
ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన సేవలందించాలి
కోదాడ: కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు మెరుగైన వైద్యసేవలందించాలని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్ తేజస్నంద్లాల్ పవార్ కోరారు. మంగళవారం కోదాడ ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు పాల్గొన్నారు. వంద పడక వైద్యశాల నిర్మాణానికి సంబంధించిన వివిధ అంశాలపై వారు అధికారులతో సమీక్షించారు. అనంతరం ప్రభుత్వ వైద్యశాలలో రోగులతో మాట్లాడారు. వారికి అందుతున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ప్రభుత్వ వైద్యశాలలపై ప్రజలకు నమ్మకం కలిగించేలా వైద్యులు పనిచేయాలని కోరారు. వైద్యుల కొరత లేకుండా త్వరలోనే భర్తీ చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ దశరథనాయక్, ఆర్డీఓ సూర్యానారాయణ, మున్సిపల్ కమిషనర్ రమాదేవి పాల్గొన్నారు.