అవకతవకలు లేకుండా సన్నబియ్యం పంపిణీ | - | Sakshi
Sakshi News home page

అవకతవకలు లేకుండా సన్నబియ్యం పంపిణీ

Apr 5 2025 1:35 AM | Updated on Apr 5 2025 1:35 AM

అవకతవకలు లేకుండా సన్నబియ్యం పంపిణీ

అవకతవకలు లేకుండా సన్నబియ్యం పంపిణీ

భానుపురి (సూర్యాపేట): జిల్లావ్యాప్తంగా ఎక్కడా ఎలాంటి అవకతవకలు లేకుండా లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అన్నారు. శుక్రవారం సచివాలయం నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నల్లమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లతో సన్నబియ్యం పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సూర్యాపేట కలెక్టరేట్‌ నుంచి కలెక్టర్‌ అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరై మాట్లాడారు. జిల్లాలో ఉన్న 610 రేషన్‌ షాపులకు 3800 మెట్రిక్‌ టన్నుల సన్న బియ్యం తరలించి ప్రజలకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఇప్పటికే ట్రాన్స్‌పోర్ట్‌ కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించామని, ఎక్కడా అవకతవకలు లేకుండా సక్రమంగా నిర్ణీత సమయంలో రవాణా చేసేలా జాగ్రత్తలు తీసుకున్నామని తెలిపారు. రెవెన్యూ అదనపు కలెక్టర్‌, పౌరసరఫరాల అధికారులు, చౌక ధరల దుకాణ యజమానులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ రాంబాబు, పౌరసరఫరాల శాఖ అధికారి రాజేశ్వరరావు, పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్‌ ప్రసాద్‌ తదితరులున్నారు.

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement