
నకిలీ విత్తనాలకు అడు్డకట్ట ఏది!
ఫ యథేచ్ఛగా నకిలీ విత్తనాల దందా
ఫ మాయమాటలతో రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్న కేటుగాళ్లు
ఫ తాజాగా తిరుమలగిరిలో నకిలీ
విత్తనాల తయారీ ముఠా గుట్టురట్టు
ఫ టాస్క్ఫోర్స్ తనిఖీలు మరింత ముమ్మరం చేస్తేనే మేలు
రైతులు అప్రమత్తంగా ఉండాలి
నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలి. వ్యవసాయ అధికారుల సూచనలు, సలహాలు పాటించాలి. విత్తనాలు కొనుగోలు చేసిన సమయంలో తప్పకుండా రసీదుపొంది భద్రపర్చుకోవాలి. ఏదైనా అనుమానాలు ఉంటే అధికారులకు తెలియజేయాలి. ప్రత్యేక బృందాలతో నకిలీ విత్తనాలు అమ్మకుండా తనిఖీలు చేపడుతున్నాం. రైతులు అధికారులకు సహకరించాలి.
– జి.శ్రీధర్రెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి
పీడీయాక్ట్ నమోదు చేస్తాం
జిల్లాలో నకిలీ విత్తనాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఎవరైన రైతులకు నకిలీ విత్తనాలను అమ్మితే పీడీయాక్ట్ నమోదు చేస్తాం. రైతులను మోసం చేస్తే ఊరుకునేది లేదు. రైతులు నకిలీ విత్తనాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలి.
– నరసింహ, జిల్లా ఎస్పీ
భానుపురి (సూర్యాపేట) : ప్రతి సీజన్లో నకిలీ విత్తనాలతో జిల్లాలో రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం వాటిపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. సీజన్ కు ముందు విత్తనాలు, ఎరువుల దుకాణాలు తనిఖీలు చేయడంతో పాటు రైతులకు అవగాహన కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో మెట్ట పంటల సాగు జోరుగా సాగుతుండగా అక్రమార్కులకు ఇదే అదునుగా మారింది. నిరక్షరాస్యులైన రైతులను టార్గెట్ గా చేసుకొని కల్తీ విత్తనాలను అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. ఓవైపు వ్యవసాయ శాఖ, పోలీస్, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నకిలీల భరతం పట్టేందుకు ముందుకు సాగుతుండగానే అక్రమార్కులు ఇవేమీ పట్టనట్టుగా తమ వ్యాపారాన్ని యథేచ్ఛగా సాగిస్తున్నారు. నకిలీ విత్తనాలను ఇతర ప్రాంతాల నుంచి తెచ్చి మాయమాటలు చెప్పి రైతులకు అంటగట్టడమే కాకుండా.. ఏకంగా జిల్లాలోనే తయారీకి పూనుకుంటున్నారు.
వాటిపై దృష్టి పెడితేనే...
సూర్యాపేట జిల్లాకు ఏపీతోపాటు సరిహద్దు జిల్లాలైన మహబూబాబాద్, ఖమ్మం, జనగామనుంచి నిషేధిత బీటీ విత్తనాలు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నకిలీ విత్తనాలను ఏజెంట్లద్వారా అమ్మకాలు జరిపిస్తున్నారు. అలాగే రైతులు ఏపీలోని గుంటూరు, నందిగామ, హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లి సైతం కొనుగోలు చేసే విత్తనాల్లో ఈ నకిలీ విత్తనాలు కూడా ఉంటున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి లైసెన్సులు లేకుండా విత్తనాలను అందించే ఫెర్టిలైజర్ షాపుల్లోనూ ఈ నకిలీ విత్తనాలు విచ్చలవిడిగా అమ్ముతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
ప్రత్యేక బృందాలు మరింతగా..
సూర్యాపేట జిల్లాలో దాదాపు 90 వేల ఎకరాల వరకు పత్తి సాగవుతోంది. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులు భూములను చదును చేసుకొని పత్తి విత్తనం నాటేందుకు సిద్ధమవుతున్నారు. కొన్నిచోట్ల ఇప్పటికే విత్తనాలను కొనుగోలు చేసి విత్తుకున్నారు. ఈ పత్తి సాగు ఈనెల చివరి వరకు రైతులు చేపట్టే అవకాశం ఉండగా నకిలీ విత్తనాల బారిన పడకుండా ఉండేందుకు ప్రభుత్వం చర్యలు మరింత కఠినంగా తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యాచరణలో భాగంగా పోలీస్ రెవెన్యూ అధికారులతో కలిసి విత్తన దుకాణాల్లో తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీలను మరింత విస్తృతం చేయాల్సి ఉంది.
తిరుమలగిరి మండలంలో ఓ వ్యక్తి నకిలీ విత్తనాల తయారీ కేంద్రమే నడుపుతున్నాడు. ఈ కేంద్రం ద్వారా తయారుచేసిన విత్తనాలను పలువురు రైతులకు విక్రయించగా సమాచారం తెలుసుకున్న పోలీసులు తయారీ ముఠాను మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జిల్లాలో నకిలీ విత్తనాల వ్యాపారం సాగుతున్న తీరుకు ఈ సంఘటన అద్దంపడుతోంది.
రైతులూ ఇవి పాటించండి..
ఫ ప్రధానంగా ఏజెంట్లు.. వ్యాపారులు చెప్పే మాయమాటలను నమ్మకుండా వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలి.
ఫ ఉద్దెర ఇస్తారని చెప్పి వ్యాపారులు ఏవిస్తే వాటిని కొనుగోలు చేయకుండా నేల స్వభావాన్ని బట్టి ఏ విత్తనాలు సాగు చేస్తే అధిక దిగుబడులు వస్తాయో వ్యవసాయ అధికారులను సంప్రదించాల్సి ఉంది.
ఫ లైసెన్స్డ్ డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలి. ప్యాకింగ్ను సరిచూసుకోవాలి.
ఫ ఏదికొన్నా రసీదు తప్పని సరిగా తీసుకోవాలి. రసీదుతో పాటు విత్తనాలకు సంబంధించిన ఖాళీప్యాకెట్ను పంట దిగుబడి చేతికందేవరకు భద్రపర్చుకోవాలి.
ఫ నిషేధిత, గడువు ముగిసిన రకాల్ని పసిగట్టాలి ధర తక్కువని, లూజుగా విక్రయించే పత్తి, మిరప విత్తనాలను కొని మోసపోవద్దు
ఫ అంగట్లో కూరగాయల్లా ఎక్కడ విత్తనాలు విక్రయానికి పెట్టినా విజిలెన్స్ అధికారులకు సమాచారం అందించాలి.
ఫ రసీదులో రైతుపేరు, విత్తన కంపెనీ పేరు, చిరునామా, లాట్ నంబర్, ప్యాకెట్ల సంఖ్యను డీలర్లు తప్పక పొందుపర్చాలి.
ఫప్యాకెట్పై లాట్నంబర్, డేట్ ఆఫ్ ప్యాకింగ్, లేబుల్, విత్తన మొలకశాతం సరిగా ఉందో లేదో చూసుకోవాలి.

నకిలీ విత్తనాలకు అడు్డకట్ట ఏది!

నకిలీ విత్తనాలకు అడు్డకట్ట ఏది!