
మొక్కలు.. జీవకోటికి ప్రాణాధారం
చివ్వెంల(సూర్యాపేట) : మొక్కలు జీవకోటికి ప్రాణాధారమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ పి.లక్ష్మీ శారద పేర్కొన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం సూర్యాపేట జిల్లా కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటి మాట్లాడారు. మొక్కలు మానవ మనుగడకు ఎంతో ఉపయోగకరమన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూకృషి చేయాలన్నారు. మానవునికి ప్రకృతికి అవినాభావ సంబంధం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జీ గోపు రజిత, బార్ అసోషియేషన్ ప్రధాన కార్యదర్శి సుంకరబోయిన రాజు, నామినేటేడ్ సభ్యులు అల్లంనేని వెంటేశ్వర్రావు, గుంటూరు మధు, నల్లపాటి మమత, డిఫెన్స్ కౌన్సిల్స్ బొల్లెద్దు వెంకరత్నం, పెండెం వాణి, న్యాయవాదులు టి.భిక్షమయ్య గౌడ్, సుధాకర్ పాల్గొన్నారు.
భూ సమస్యల
పరిష్కారానికి సదస్సులు
చివ్వెంల(సూర్యాపేట) : రైతుల భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తోందని జిల్లా అదనపు కలెక్టర్ పి.రాంబాబు అన్నారు. గురువారం చివ్వెంల మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని బి.చందుపట్ల, ఉండ్రుగొండ గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను పరిశీలించి మాట్లాడారు. ఆయా గ్రామాల్లో రైతులు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ప్రకాశ్రావు, డిప్యూటీ తహసీల్దార్ పద్మజ, ఆర్ఐలు శ్రావణి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
దేశానికి సేవ
చేయడమే లక్ష్యం
తాళ్లగడ్డ (సూర్యాపేట) : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశానికి సేవ చేయడమే బీజేపీ లక్ష్యమని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కొల్లి మాధవి పేర్కొన్నారు. 11 సంవత్సరాల మోదీ ప్రభుత్వ పాలన – సంకల్పంతో సహకారం, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై గురువారం పార్టీ జిల్లా అధ్యక్షురాలు చల్లా శ్రీలతారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. సమావేశంలో పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొబ్బా భాగ్యారెడ్డి, కార్యక్రమ కన్వీనర్ మల్సూర్ గౌడ్, కో–కన్వీనర్లు తాళ్ల నరేందర్ రెడ్డి, జెనిగల శ్రీనివాస్ గౌడ్, జల్లా జనార్దన్, నాయకులు కిషన్, నరసింహ, నారాయణ, సాయిబాబా, కొండ హరీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మొక్కలు.. జీవకోటికి ప్రాణాధారం

మొక్కలు.. జీవకోటికి ప్రాణాధారం