నేడు తుర్కపల్లికి ముఖ్యమంత్రి రాక | - | Sakshi
Sakshi News home page

నేడు తుర్కపల్లికి ముఖ్యమంత్రి రాక

Jun 6 2025 12:58 AM | Updated on Jun 6 2025 12:58 AM

నేడు

నేడు తుర్కపల్లికి ముఖ్యమంత్రి రాక

రూ.1,500 కోట్ల పనులకు

తుర్కపల్లి మండలం తిర్మలాపురం వద్ద శంకుస్థాపనలు

అక్కడే సభలో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

యాదగిరిగుట్ట : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆలేరు నియోజకవర్గంలో సుమారు రూ.1,500 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు. ఇందుకు తుర్కపల్లి మండలం తిర్మలాపురం వేదిక కానుంది. ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్‌ ఇచ్చి , సభలో పాల్గొననున్నారు.

శంకుస్థాపనలు చేసే పనులు ఇవే..

ఫ యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో భక్తులకు వసతుల కల్పన, అభివృద్ధి పనులకు రూ.100 కోట్లు కేటాయించారు. టెంపుల్‌ సిటీలో 15 ఎకరాల్లో రూ.43.79 కోట్లతో వేద పాఠశాల నిర్మాణం. దాతారుపల్లి రెవెన్యూ పరిధిలోని వైటీడీఏ స్థలంలో రూ.180కోట్లతో మెడికల్‌ కళాశాల నిర్మాణం, దాతారుపల్లిలో రూ.15కోట్లతో నిరించే వేర్‌ హౌజింగ్‌ గోదాములకు వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు.

ఫ తుర్కపల్లి మండలంలోని గంధమల్ల రిజర్వాయర్‌ పనులకు, రాంపూర్‌తండా సమీపంలో 15ఎకరాల స్థలంలో నిర్మించే యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణానికి శంకుస్థాపన.

ఫ ఆలేరు నియోజకవర్గంలో రూ.50 కోట్లతో నిర్మించనున్న ఆర్‌అండ్‌బీ రోడ్లకు, రూ.14.50 కోట్లతో కొలనుపాక, కాల్వపల్లి వాగులపై హైలెవల్‌ బ్రిడ్జిలు, రూ.30 కోట్లతో సీఆర్‌ఆర్‌, ఎంఆర్‌ఆర్‌ రోడ్లకు, మోటకొండూర్‌లో రూ.10కోట్లతో ఎంపీపీ, తహసీల్దార్‌, పోలీస్‌ స్టేషన్‌ భవనాలకు, ఆలేరులో రూ.15కోట్లతో నిర్మించే మార్కెట్‌ యార్డు గోదాములకు శంకుస్థాపన చేస్తారు.

సీఎం టూర్‌ షెడ్యూల్‌..

సీఎం 2.40కి హైదరాబాద్‌లోని బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 3గంటలకు తిర్మలాపురం చేరుకుంటారు. 3.10కి వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం బహిరంగసభలో పేదలకు సంక్షేమ పథకాల ప్రొసీడింగ్స్‌ అందజేస్తారు. 5 గంటలకు హెలికాప్టర్‌లో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్తారు.

నేడు తుర్కపల్లికి ముఖ్యమంత్రి రాక1
1/1

నేడు తుర్కపల్లికి ముఖ్యమంత్రి రాక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement