
నేడు కోదాడ పబ్లిక్ క్లబ్ బహిరంగ వేలం
కోదాడ: కోదాడ పబ్లిక్ క్లబ్ నూతన భవనాన్ని ఆదివారం 10 గంటల నుంచి 12:30 గంటల మధ్య చట్ట పరిధిలోని నిబంధనలకు లోబడి బహిరంగవేలం నిర్వహిస్తున్నామని క్లబ్ కార్యదర్శి బొల్లు రాంబాబు తెలిపారు. శనివారం కోదాడ పబ్లిక్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. క్లబ్ అధ్యక్ష , ఉపాధ్యక్షులు అమెరికాలో ఉన్నప్పటికీ వారిన సంప్రదించి, కార్యవర్గం తీర్మానం మేరకే వేలం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. వేలంలో ఎవరైనా పాల్గొనవచ్చని, ఒక సామాజికవర్గానికి కట్టబ్టెడానికి ప్రయత్నం జరుగుతుందనేది అవాస్తమని అన్నారు. ఎవరు ఎక్కువ ధర పెడితే వారికే భవనాన్ని అమ్ముతామన్నారు. ఈ సమావేశంలో క్లబ్ జాయింట్ సెక్రటరీ చింతలపాటి శేఖర్, కార్యవర్గ సభ్యులు గుండపనేని వేణు తదితరులు పాల్గొన్నారు.
ఫ క్లబ్ కార్యదర్శి రాంబాబు వెల్లడి