శుక్రవారం శ్రీ 14 శ్రీ మార్చి శ్రీ 2025
సూర్యాపేట టౌన్: ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురైతే ఎక్కువగా తలకు గాయాలై విగతజీవులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో నిబంధనలు పాటించాలని, హెల్మెట్ ధరించి బైకులు నడపాలని పోలీసులు నిరంతరం అవగాహన కల్పిస్తూ, జరిమానాలు విధిస్తున్నా వాహనదారుల తీరుమారడం లేదు. హెల్మెట్ లేకుండా నిర్లక్ష్యంగా బైకులు నడుపుతూ ప్రమాదాల్లో తలకు దెబ్బలు తగిలి ప్రాణాలు కోల్పోతున్నారు. మూడేళ్లలో బైకుల ప్రమాదాల్లో 329 మృత్యువాతపడ్డారు.
పోలీసులను చూసి..
రోడ్డు ప్రమాదాల్లో బైక్ ప్రమాదాలే ఎక్కువగా ఉంటున్నాయి. ఇందులో హెల్మెట్ ధరించకపోవడం వల్ల తలకు తీవ్ర గాయాలై మృత్యువాత పడుతున్నవారే అధికంగా ఉంటున్నారు. అయితే హెల్మెట్ ధరిస్తే 70శాతం ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. దీనిపై చాలా మందికి అవగాహన లేదు. ఒకవేళ హెల్మెట్ పెట్టుకున్నా దాని క్లిప్పులు సరిగా పెట్టుకోకపోవడం వల్ల ప్రమాదం జరిగిన సమయంలో అకస్మాత్తుగా ఊడిపోయి తీవ్ర గాయాలపాలవుతున్నారు. కొందరు మాత్రం ట్రాఫిక్ చలానాలకు భయపడి పోలీసులను చూసి హెల్మెట్ ధరించడం వంటివి చేస్తున్నారు. ప్రతిఒక్కరూ ఇంటి నుంచి బైకుపై బయటకు వెళ్లేటప్పుడు విధిగా హెల్మెట్ ధరిస్తే ప్రమాదాల నుంచి కాపాడుకోవచ్చు.
హెల్మెట్ ధరించకపోవడంతో..
మూడు సంవత్సరాల్లో జరిగిన బైకు ప్రమాదాల్లో జిల్లా వ్యాప్తంగా 329 మంది మృతి చెందారు. ఈ మూడేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ద్విచక్ర వాహనదారులే ఎక్కువమంది మృతి చెందారు. ఇందులో 50శాతం మంది హెల్మెట్ ధరించకపోవడం వల్లే మృతి చెందారని పోలీసులు అధికారులు చెబుతున్నారు.
న్యూస్రీల్
సూర్యాపట్టణానికి చెందిన ఓ వ్యక్తి వృత్తిరీత్యా కారు డ్రైవర్. ఫిబ్రవరి 27న రాత్రి తన కారును ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల సమీపంలో పార్కింగ్ చేసి 60 ఫీట్ల రోడ్డులో గల తన ఇంటికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా తాళ్లగడ్డ సమీపంలో మరో ద్విచక్ర వాహనం అతివేగంతో వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న కారు డ్రైవర్ తలకు తీవ్ర గాయాలై మృతి చెందాడు. ఢీ కొట్టిన వ్యక్తికి కూడా గాయాలయ్యాయి.
ఇద్దరికీ హెల్మెట్ లేకపోవడంతో ఒకరు మృతి
చెందగా మరొకరు గాయాలపాలయ్యారు.
మూడేళ్లలో జరిగిన బైకు ప్రమాదాలు..
సంవత్సరం ప్రమాదాలు మృతులు
2023 327 165
2024 320 151
2025 53 13