పంచారామాలకు ప్రత్యేక బస్సులు | - | Sakshi
Sakshi News home page

పంచారామాలకు ప్రత్యేక బస్సులు

Oct 27 2025 7:11 AM | Updated on Oct 27 2025 7:11 AM

పంచారామాలకు ప్రత్యేక బస్సులు

పంచారామాలకు ప్రత్యేక బస్సులు

శ్రీకాకుళం అర్బన్‌: కార్తిక మాసం సందర్భంగా పంచారామాలకు వెళ్లే ప్రత్యేక బస్సులను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల మేనేజర్లు హనుమంతు అమరసింహుడు, కేఆర్‌ఎస్‌ శర్మ పిలుపునిచ్చారు. పంచారామాలకు వెళ్లే ఆర్టీసీ బస్సులను శ్రీకాకుళం బస్‌ స్టేషన్‌ ఆవరణలో ఆదివారం 1, 2 డిపోల మేనేజర్లు అమరసింహుడు, శర్మ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్తిక మాసంలో నాలుగు వారాల్లో ప్రతి ఆదివారం సాయంత్రం 4 గంటలకు జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి బస్సులు బయల్దేరుతాయని తెలిపారు. ఈ బస్సులు సోమవారం పంచారామాలను దర్శించుకుని మళ్లీ మంగళవారం ఉదయం 6గంటలకు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుతాయని పేర్కొన్నారు. ఈ సర్వీసుల్లో టికెట్లు బుక్‌ చేసుకున్న భక్తులు అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షారామం, సామర్లకోటలో గల శివాలయాల దర్శనానికి వెళ్తారని చెప్పారు. అక్టోబరు 2, 9, 16 తేదీల్లో కూడా బస్సులు నడుపుతామన్నారు. ‘ఒక్క ఫోన్‌ కాల్‌తో మీ వద్దకు ఆర్టీసీ బస్సు’ అనే నినాదంతో ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. మరి న్ని వివరాలకు 99592 25608, 99592 25609, 99592 25610, 99592 25611 నంబర్లకు ఫోన్‌ చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఎస్‌ఎం ఎంపీ రావు, ఆర్టీసీ అధికారులు రాజు, సెక్యూరిటీ సిబ్బంది, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement