
● అక్రమ ఎరువులు సీజ్
కంచిలి: డోలగోవిందపురం గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా అమ్మకాలు చేయడానికి రెండు గోడౌన్లలో నిల్వ చేసిన ఎరువుల్ని విజిలెన్స్ కమిటీ అధికారుల బృందం సోమవా రం సీజ్ చేసింది. అరవసరియాపల్లి గ్రామానికి చెందిన బొండాడ అప్పలస్వామి, బొండాడ తిరుపతి, బొండా డ టొంకాడు అనే వ్యక్తులకు అధిక ధరలకు అమ్ముతున్నారని వారి స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేశారు. లడ్డుకేశవ పాత్రోకు చెందిన రెండు గోడౌన్లలో నిల్వచేసిన 18 బస్తాల యూరియా, 15.15.15 కాంప్లెక్స్ ఎరువు 17 బస్తాలు, పొటాషియం హ్యూమేట్ 13 బస్తాలు, ఆర్గానిక్ ఫెర్టిలైజర్ 10 బస్తాలు, 20.20.0 కాంప్లెక్స్ 5 బస్తాలు సీజ్ చేశారు.