
పేటలో మాటల తూటా
శ్రీకాకుళం
ఊరి బడికి ఊపిరిగంగాధరపేట వాసులు బడిని కాపాడుకున్నారు. మూసివేత ముప్పును తప్పించారు. –8లో
సోమవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2025
పలాస, టెక్కలిలో డివిజన్ స్థాయి రెవెన్యూ సమావేశాలు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో రెవెన్యూ పరిపాలన మరింత సమర్థంగా ఉండేందుకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధ్యక్షతన రెవెన్యూ అధికారుల సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం పలాసలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫి ర్యాదుల స్వీకరణ అనంతరం, పలాస డివిజన్ అధికారుల సమావేశాన్ని నిర్వహించనున్నారు. అలాగే జూలై 2 వ తేదీన టెక్కలిలో టెక్కలి డివిజన్ రెవెన్యూ అధికారుల సమావేశం జరగనుంది. ఈ మేరకు వివరాలు తెలియజేస్తూ జిల్లా రెవెన్యూ అధికారి మారెళ్ల వెంకటేశ్వరరావు ప్రకటన విడుదల చేశారు. సమీక్ష సమావేశాల్లో ప్రజలకు సంబంధించిన అంశాలపై చర్చించి, పరిష్కార మార్గాలు సూచించనున్నట్లు తెలిపారు.
మేట తొలగింది..
గండం గడిచింది
ఇచ్ఛాపురం రూరల్: ఇటీవల కురిసిన వర్షాలకు డొంకూరు మత్స్యకార గ్రామంలోని బంగాళాఖాతంలో ఏర్పడిన ఆటుపోట్లకు సముద్రం–ఉప్పుటేరు మధ్య ఇసుక మేట వేయడంతో పంట పొలాల్లో ఉప్పునీరు పూర్తిగా నిండిపోయింది. ఖరీఫ్ సీజన్ దగ్గర పడుతుండటంతో రైతులు నారు మడులు వేసేందుకు భయాందోళన చెందారు. అధికారులు స్పందించకపోవడంతో పంచాయతీ నిధులతో ఆదివారం పంచాయతీ పాలక వర్గం పొక్లెయినర్లతో ఇసుక మేటలు(పొగురు తీత) తొలగించి ఉప్పుటేరు నీటిని సముద్రంలోకి మళ్లించారు. దీంతో అ టు అన్నదాతలు, ఇటు మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ దున్న గురుమూర్తి, సర్పంచ్ బుడ్డ కళ్యాణ్, చీకటి కృష్ణ, బాలరాజు, శివంగి మోహనరావు, బైపల్లి మోహనరావులతో పాటు గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
బాహుదాకు గర్భశోకం
ఇచ్ఛాపురం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ఇచ్ఛాపురంలో ఇసుక రీచ్లను ప్రభుత్వం మంజూరు చేయనప్పటికి స్థానిక నేతల సాయంతో బాహుదా నది పరివాహక ప్రాంతాల్లో ఇసుకాసురులు దర్జాగా తవ్వకాలు సాగిస్తున్నారు. ఈ విదంగా తవ్వకాలు చేపట్టడంతో బాహుదానది ఇప్పటికే ముళ్ల పొదలు, పిచ్చిమొక్కలతో నిండిపోయింది. నదికి వరదలు వచ్చేటప్పుడు నది ఉప్పొంగే సమయంలో మట్టిదిబ్బలు, వరదగట్లు రక్షణగా ఉంటున్నాయి. ప్రస్తుతం ఇసుకాసురుల కన్ను బాహుదానదిలో గల మట్టిదిబ్బలు, వరద గట్లపై పడింది. దీంతో ఆ మట్టిదిబ్బలు, వరదగట్టులను సైతం తవ్వేస్తున్నారు. పట్టపగలే ఈ తంతు జరుగుతున్నా అధికారులు స్పందించడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే వరదల సమయంలో ఊరిలోకి నీరు వచ్చేస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
‘యూజ్లెస్ ఫెలో’.. టీడీపీ వర్గాల్లో రెండురోజులుగా నలుగుతున్న మాట ఇది. జిల్లా తెలుగుయువత అధ్యక్షుడు, కింజరాపు సోదరుల ముద్దుల మేనల్లుడు మెండ దాసునాయుడుపై సాక్షాత్తు అతని బావ కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు సమక్షంలోనే నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కుమార్తె అర్చన ఈ పదం వాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశా రు. అంతటితో ఆగకుండా ‘గెట్అవుట్’ అని కూడా అన్నారు. అసలు అర్చనకు దాసునాయుడుపై ఇంత అసహనానికి కారణమేంటి?, అనుకోకుండా అక్కడ జరిగిన ఇష్యూ వల్లనే దాసునాయుడును అనాల్సి వచ్చిందా..? లేక మరేదైనా కారణం మనసులో పెట్టుకుని అందరిముందూ అవకాశం చూసుకుని కావాలనే ‘గెట్అవుట్’ అన్నారా..? అని ఇలా అనేక రకాలుగా పార్టీలో చర్చ జరుగుతోంది.
తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు మెండ దాసునాయుడు దురుసుగా వ్యవహరిస్తున్నారు. మంత్రి అచ్చెన్నాయుడు మామ అనో, కేంద్రమంత్రి రా మ్మోహన్నాయుడు బావనో గానీ దూకుడుగా వెళ్తున్నారు. అంతా తానే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. జిల్లా కేంద్రంలో అనేక వ్యవహారాలు నడుపుతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను, ఇతర నాయకులను ఓవర్టేక్ చేసి చక్రం తిప్పుతున్నారు. కానీ నరసన్నపేటలో ఆయన ఆధిపత్యం సాగలేదు. దిమ్మతిరిగే విధంగా, అవాక్కయ్యేలా అవమానం ఎదుర్కొన్నారు. ప్రతి విషయంలోనూ ఆయన జోక్యం చేసుకుంటుండడంతో ఎమ్మెల్యేతో పాటు కుమార్తె ఒప్పుకోవడం లేదని, అందుకే ఇలా అన్నారనే వాదన ఉంది. అర్చన చేసిన వ్యాఖ్యలు టీడీపీలో చిచ్చు రేపాయి.
పేటలో కింజరాపు కోటరీకి దన్ను
నరసన్నపేట ఎమ్మెల్యే రమణమూర్తి అయినప్పటికీ అక్కడ కింజరాపు కుటుంబం ప్రత్యేకంగా కోటరీని నడుపుతోందని రమణమూర్తి వర్గం ఎన్నికల్లో సీటు కేటాయించినప్పటి నుంచే ఆరోపిస్తూ వస్తోంది. సొంత నియోజకవర్గం కావటం, బావ కేంద్రమంత్రిగా, మామ రాష్ట్రమంత్రిగా కొనసాగుతుండటంతో దాసునాయుడు ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా పనులు చేపడుతున్నారని రమణమూర్తి వర్గం నుంచి ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా పోలాకి మండలంలోని అప్పట్లో హరిశ్చంద్రపురం నియోజకవర్గం నుంచి విడిపోయి నరసన్నపేటలో చేరిన 14 పంచాయతీల టీడీపీ కేడర్ ఇప్పటికీ నిమ్మాడ నాయకత్వంపైనే ఆధారపడుతున్నారనేది వాస్తవం. ఆ గ్రామాల్లోనే దాసునాయుడు స్వగ్రామం యాట్లబసివలస కూడా ఒక టి. క్రమేణా ఆయాగ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు నిమ్మాడలో రామ్మోహన్నాయుడు, అచ్చెన్నాయుడు అందుబాటులో లేకపోవటంతో దాసునాయుడుకు టచ్లోకి వెళ్లిపోతున్నారు. ఇవన్నీ మనసులో పెట్టుకుని ‘గెట్అవుట్’ అని ఉండవచ్చని కొందరు అంటున్నారు.
కించపరిచినందుకేనా..?
అధికారంలోకి వచ్చిన తర్వాత మేనమామల అండతో దాసునాయుడు ఆధిపత్యం మరింత ఎక్కువైంది. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే ఫొటో లేకుండా నరసన్నపేట నియోజకవర్గం మొత్తం దాసునాయుడు జన్మదిన బ్యానర్లు, వాల్పోస్టర్లతో అనుచరులు హ డావుడి చేశారు. సోషల్మీడియాలో సైతం పేటలో కాబోయే ఎమ్మెల్యే దాసునాయుడే అంటూ రమణమూర్తిని కించపరిచేలా వ్యవహరించటం వెనుక దా సునాయుడు పాత్ర ఉందనేది అర్చన అనుమానం కావచ్చు. పట్టణంలో ఇటీవల ఒక హోటల్ ప్రారంభానికి ఎమ్మెల్యే లేకుండా దాసునాయుడు నేరుగా ప్రారంభానికి విచ్చేశారని, దీంతో బగ్గు వర్గానికి మ రింత మండినట్లు అయిందని చెబుతున్నారు. ఇవే కాకుండా వైన్స్ సిండికేట్ దగ్గర కూడా అక్కడక్కడా దాసునాయుడు వర్గంతో ఇబ్బందులు తలెత్తుతున్న ట్లు వినికిడి. ఒక సమావేశంలో ఎమ్మెల్యేను నెట్టేసినట్టు సైతం వార్తలు వినిపిస్తున్నాయి.
బగ్గు రమణమూర్తి కుమార్తె అర్చన చేసిన వ్యాఖ్యలు రచ్చ రచ్చ అవుతున్నాయి. సోషల్ మీడి యా వేదికగా పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలుగు యువత అధ్యక్షుడిని పట్టుకుని అంత పెద్ద మాట అనేస్తారా అని పోస్టులు పెట్టుకు ని బాధపడుతున్నారు. నరసన్నపేట నియోజకవర్గంలోనే కాదు జిల్లా వ్యాప్తంగా యూజ్ లెస్ ఫెలో.. గెట్ అవుట్ వ్యాఖ్యలపై చర్చ నడుస్తోంది.
● మార్పులే గానీ చేర్పులు లేని పింఛన్ జాబితాలు
● పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులు
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో కొత్త పింఛన్ల కోసం ఎదు రు చూపులు తప్పడం లేదు. కూటమి పాలనలో నెలనెలా కలిపి దాదాపు 12వేల మంది పింఛన్లను తొలగించేసిన ప్రభుత్వం కొత్తవారికి మాత్రం పింఛన్ల జాబితాలో చోటు కల్పించడం లేదు. 2024 ఏప్రిల్లో జిల్లాలో పింఛన్దారుల సంఖ్య 3,20,886 ఉండగా ఈ ఏడాది మే నాటికి ఆ సంఖ్య 3,08,674కు పడిపోయింది. దాదాపు 12,212 పింఛన్లు తగ్గాయి. చనిపోయిన వారి సంఖ్య పక్కన పెట్టేసినా.. అనర్హుల పేరుతో రాజకీయ కారణాలతో తీసేసిన వారి సంఖ్యే ఎక్కువ.
కొత్త పింఛన్ల మాట అటుంచితే ఉన్న పింఛన్లను కూడా ప్రతి నెలా తీసేస్తున్నారు. ప్రధానంగా దివ్యాంగులు తమ దివ్యాంగత్వం నిరూపించుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. సదరం పత్రం ఉన్నా మరోసారి వెరిఫికేషన్ చేసుకోవాలని, లేకుంటే పింఛన్ నిలిపివేస్తామని నోటీసులు ఇచ్చి తొలగించడానికి కూడా వెనుకాడడం లేదు. ఇక చాలా గ్రామాల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరితంగా పింఛన్లను ఆపే క్రమం నడుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేశారనే నెపంతో పింఛన్లు ఆపేశారు.
జిల్లాలో దాదాపు ఇరవై వేల మంది పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు. వారంతా వయోవృద్ధులు, సదరం దివ్యాంగ పత్రాలు కలిగిన వారు, ఒంటరి మహిళలు, అనారోగ్య బాధితులు. కానీ వీరికి పింఛన్లు మంజూరు చేసే అవకాశాలు కనిపించడం లేదు. వారి గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలీక అవస్థలు పడుతున్నారు. రెండు నెలల కిందట భర్త పింఛనుదారుడై ఉండి మరణిస్తే వారి భార్యకు వితంతు పింఛన్ ఇస్తామని చెప్పారు. ఇలాంటి వారు జిల్లాలో 4623 మంది ఉన్నారని లెక్కలు వేశారు. కానీ వారికి పింఛన్ మొత్తం అందడం లేదు. ఇక యాభై ఏళ్లకే పింఛన్ హామీని పాలకులు పూర్తిగా మర్చిపోయారు.
న్యూస్రీల్
మెండ దాసునాయుడిపై ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి కుమార్తె అర్చన తీవ్ర వ్యాఖ్యలు
‘యూజ్లెస్ ఫెలో’ అనడంతో పార్టీలో దుమారం
హీటెక్కిన టీడీపీ అంతర్గత రాజకీయం
వేడెక్కిన టీడీపీ అంతర్గత రాజకీయం
మెండ దాసునాయుడ్ని యూజ్ లెస్ ఫెలో...గెట్ అవుట్ అంటూ ఎమ్మెల్యే కుమార్తె అర్చన చేసిన వ్యాఖ్యలతో టీడీపీలో అంతర్గత రాజకీయం వేడెక్కింది. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర మంత్రి వద్ద చర్చ పెట్టాలని, ఏదో ఒకటి నిర్ణయం తీసుకోవాలని మెండ దాసునాయుడు వర్గం డిమాండ్ చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెడుతోంది. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో నరసన్నపేట నుంచి మెండ దాసునాయుడే పోటీ చేస్తారని అప్పుడు చూసుకుంటామని తామేంటో చూపిస్తామని బీరాలు కూడా పలు కుతున్నారు. మరోవైపు జరుగుతున్న పరిణామాలపై బగ్గు రమణమూర్తి వర్గం కూడా నిశితంగా పరిశీలిస్తోంది. తదుపరి ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై సమాలోచనలు చేస్తోంది.

పేటలో మాటల తూటా

పేటలో మాటల తూటా

పేటలో మాటల తూటా