క్లస్టర్‌ ఉపాధ్యాయులకు | - | Sakshi
Sakshi News home page

క్లస్టర్‌ ఉపాధ్యాయులకు

Jun 30 2025 3:46 AM | Updated on Jun 30 2025 3:46 AM

క్లస్

క్లస్టర్‌ ఉపాధ్యాయులకు

గోడు వినేవారు కరువు

భాషోపాధ్యాయుల సమస్యలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. రాష్ట్ర అధికారులకు, ప్రజాప్రతినిధులకు చెబుతున్నా మా సమస్యలు పరిష్కరించకుండా మరింత జటిలం చేస్తున్నారు. క్లస్టర్‌ పోస్టుల్లో పనిచేస్తున్న వారి కష్టాలు వర్ణణాతీతం.

– పిసిని వసంతరావు,

చైర్మన్‌ భాషోపాధ్యాయ సంస్థ, శ్రీకాకుళం

ఏ పాఠశాలలో ఏ సబ్జెక్టు

బోధించాలో తెలీని పరిస్థితి

క్లస్టర్‌ పరిధిలో ఏ పాఠశాలకు వెళ్లాలో తెలీని వైనం

బయోమెట్రిక్‌ సమయానికి వెళ్లలేమోనని ఆందోళన

శ్రీకాకుళం: జిల్లాలో ఈ ఏడాది కొత్తగా ఏర్పాటు చేసిన క్లస్టర్‌ ఉపాధ్యాయ పోస్టుల్లో ఉన్న వారికి అనుకోని కష్టాలు ఎదురవుతున్నాయి. క్లస్టర్‌ పోస్టులను ఏర్పాటు చేసినప్పటికీ విధి విధానాలు ఇప్పటివరకు ప్రకటించలేదు. ఉపాధ్యాయుల బదిలీలకు ముందు క్లస్టర్‌ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని, అందులో నియమితులైన వారు క్లస్టర్‌ పరిధిలో ఎవరైనా సెలవు పెడి తే, ఆయా పాఠశాలలకు వెళ్లాలని సూచించారు. క్లస్టర్‌ పరిధిలో 10 నుంచి 15 పాఠశాలలు ఉంటాయి. ఈ పాఠశాలల్లో ఎవరైనా సెలవు పెడి తే, ఆ పాఠశాలకు క్లస్టర్‌ ఉపాధ్యాయుడు వెళ్లా ల్సి ఉంటుంది. ఈ క్లస్టర్‌ పోస్టుల్లో నియమితు లైన వారంతా డీఈఓ పూల్‌లో ఉన్న తెలుగు స్కూల్‌ అసిస్టెంట్లు కావడం గమనార్హం. వీరు తెలుగు ఉపాధ్యాయులైనప్పటికి, తెలుగు బోధించే పరిస్థితి ఉండదు. క్లస్టర్‌ పరిధిలోని ఏ పాఠశాలలోనైనా ఎవరైనా సెలవు పెడితే వీరు బోధించాల్సి ఉంటుంది. దీంతో వీరు మనోవేదనకు గురవుతున్నారు.

అలాగే ఇటీవల విద్యాశాఖ రాష్ట్ర అధికారులు ఓ ఉత్తర్వు విడుదల చేస్తూ, ప్రార్థన సమయానికి ఏ ఉపాధ్యాయుడైనా బయోమెట్రిక్‌ వేయకపోతే, వారిని గైర్హాజరు కింద పరిగణించి, ఆ రోజు జీతం కూడా చెల్లించకూడదని పేర్కొన్నారు. దీంతో ఎప్పుడు ఏ పాఠశాలకు వెళ్లాలో తెలీని క్లస్టర్‌ ఉపాధ్యాయులు మరింత వేదనకు గురవుతున్నారు. సమాచారం లోపం ఉంటే సమయానికి బడికి వెళ్లడం కుదరని పని. అలాగే క్లస్టర్‌ ఉపాధ్యాయుడి బయోమెట్రిక్‌ కూడా క్లిష్టతరంగా ఉంటోంది. ఆన్‌లైన్‌లో స్పెష ల్‌ డ్యూటీ అప్లై చేసుకుని, వెళ్లబోతున్న పాఠశాల లొకేషన్‌ నమోదు చేసి, హాజరు వేయాల్సి ఉంటుంది. ఇలా ఎన్నో రకాలుగా క్లస్టర్‌ ఉపా ధ్యాయులకు గండాలు ఎదురవుతున్నాయి.

ఇటీవల ఉపాధ్యాయుల బదీలీలు జరగక ముందు, డీఈఓ పూల్‌లో 200 మందికి పైగా భాషా పండితులు ఉండేవారు. వీరిలో 100 మందిని క్లస్టర్‌ పోస్టుల్లో నియమించగా 45 మంది హిందీ, 18 మంది ఒడియా, 60మంది వరకు తెలుగు భాషా ఉపాధ్యాయులు ఇంకా డీఈఓ పూల్‌ ఉన్నారు. వాస్తవానికి జిల్లా వ్యాప్తంగా 160 ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో భాషోపాధ్యాయులను నియమిస్తే, క్లస్టర్‌ పోస్టులను ఏర్పాటు చేయాల్సి ఉన్నా డీఈఓ పూల్‌లో ఉంచాల్సిన పని ఉండదు. ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో 6,7,8 తరగతులు ఉన్నప్పటికి, తెలుగు పోస్టునే ఇవ్వలేదు. ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సర్‌ ప్లస్‌ ఉపాధ్యాయులు ఉన్నప్పటికి, డీఎస్సీని ప్రకటించి, క్షేత్ర స్థాయిలో ఖాళీలను చూపించేందుకు ఫీట్లు చేస్తున్నారు. ఇప్పటిౖకైనా ఈ గందరగోళ పరిస్థితిని తప్పించాలని గురువులు కోరుతున్నారు.

క్లస్టర్‌ ఉపాధ్యాయులకు1
1/1

క్లస్టర్‌ ఉపాధ్యాయులకు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement