
నరసన్నపేట: జిల్లా కేంద్రంలోని అరసవల్లి రోడ్డులో ఉన్న సన్రైజ్ హొటల్లో జూలై 3న సాయంత్రం 3 గంటలకు వైఎస్సార్ సీపీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నామని పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’పై కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకు ఈ సమావేశం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. ఇందులో శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కురసాల కన్నబాబు, పార్టీ జిల్లా పరిశీలకులు కుంభా రవిబాబు తదితరులు ముఖ్య అతిథులు గా పాల్గొంటారని తెలిపారు.