శ్రీకాకుళం | - | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం

Jun 29 2025 3:05 AM | Updated on Jun 29 2025 3:05 AM

శ్రీక

శ్రీకాకుళం

ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్‌ శ్రీ 2025

నోట్ల మార్పిడి నిందితుడికి

టీడీపీతో లింకులు

రూ. 500 నోట్లు ఇస్తే అంతకు

రెట్టింపుగా రూ. 2వేలు నోట్లు

ఇస్తానని మోసం

తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో మోసం చేసి దొరికిన కాశీబుగ్గకు చెందిన

అంబటి సంతోష్‌

మంత్రి అచ్చెన్నాయుడుతో తీసుకున్న ఫొటోను ప్రొఫైల్‌ పిక్‌గా పెట్టుకున్న

సంతోష్‌

కేసు నుంచి తప్పించుకునేందుకు టెక్కలిలో కీలక నేతను సంప్రదించిన బంధువులు

● పరువు పోతుందని జోక్యం చేసుకోని నేత

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో నోట్ల మార్పిడి మోసం ప్రధాన నిందితుడు అంబటి సంతోష్‌ ఉన్న చిత్రమిది. సంతోష్‌ ఫేస్‌బుక్‌లో ఈ చిత్రాన్నే ప్రొఫైల్‌గా పెట్టుకున్నారు. ఈయనే కాదు వారి కుటుంబ సభ్యులు కూడా టీడీపీ నాయకులతో ఉన్న ఫొటోలున్నాయి. టీడీపీ జెండా ఆవిష్కరించిన చిత్రాలు కూడా సోషల్‌ మీడియాలో

హల్‌చల్‌ చేస్తున్నాయి.

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:

న దగ్గర ఎక్కడా రూ.2వేల నోట్లు చెలామణిలో లేవు. ఎవరి దగ్గరైనా ఆ నోట్లు ఉంటే, తగు ఆధారాలు చూపించి రిజర్వ్‌ బ్యాంకులో మార్చుకోవచ్చు. ఈ వెసులుబాటును వాడుకుని తిరుపతి జిల్లా సూళ్లూరు పేటలో ఒక వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. తమకు కోటి విలువైన రూ.500నోట్లు ఇస్తే, రూ.2.5కోట్లు విలువైన రూ.2వేల నోట్లు ఇస్తానని ఒకరిని నమ్మించాడు. డబ్బుకు ఆశ పడిన ఓ వ్యక్తి డీల్‌ ప్రకారం రూ.500నోట్లతో రూ.కోటి ఇచ్చేశాడు. డబ్బు తీసుకున్నాక రూ.2.5కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ఇవ్వకుండా టోపీ పెట్టాడు. వెంటనే అప్రమత్తమైన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో మధ్యవర్తికి ఇచ్చిన సొమ్మును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

తిరుపతి జిల్లాలో జరిగిన ఈ సంఘటనకు జిల్లాతో లింకులున్నాయి. ఆ మోసం చేసింది మన జిల్లాకు చెందిన కాశీబుగ్గ వాసి. అందునా టీడీపీకి చెందిన వ్యక్తి. పేరు అంబటి సంతోష్‌. అతని కుటుంబమంతా టీడీపీలోనే ఉంది. అటు కాశీబుగ్గలో, టెక్కలి నియోజకవర్గ పరిధిలో కుటుంబ సభ్యులు ఉన్నారు. ఆయన కోసం, తనతో ఫోన్‌ కాంటాక్ట్‌లో ఉన్న వారి కోసం సూళ్లూరు పేట పోలీసులు ఇటీవల కాశీబుగ్గ, టెక్కలి వచ్చారు. విషయం ముందుగానే తెలియడంతో దొరకకుండా జాగ్రత్త పడ్డారు. కానీ, అంబటి సంతోష్‌ మాత్రం చివరికి పోలీసులకు వేరే చోట పట్టుబడ్డారు.

నోట్ల మార్పిడి మోసంలో నిందితుడైన అంబటి సంతోష్‌ కోసం సూళ్లూరు పేట పోలీసులు విచారణ చేస్తుండగా ఆయన కాల్‌ లిస్టులో వరసకు బంధువులైన టెక్కలికి చెందిన అధికార పార్టీ చోటా నాయకులు, మరికొంతమంది నంబర్లు ఉండటంతో టెక్కలిలో సదరు పోలీసులు ఆరా తీశారు. ఎప్పుడైతే పోలీసుల రాకను తెలుసుకున్నారో వెంటనే ఆ పార్టీకి చెందిన కీలక నేత వద్దకు వెళ్లారు. కాపాడాలని ప్రాధేయ పడినట్టు తెలిసింది. కాకపోతే, ఆ నేత ససేమిరా అనేశారు. ఇప్పుడీ విషయంలో జోక్యం చేసుకుంటే పరువు పోతుందని, తనకు మచ్చగా మారుతుందని భయపడి కాస్త తిట్టి పంపించేశారు. దీంతో చేసేదేమీలేక సైలెంట్‌గా ఉండిపోయారు.

పాత నేరస్తుడే..

సూళ్లూరుపేటలో నోట్లు మార్పిడి మోసంలో ప్రధాన నిందితుడైన అంబటి సంతోష్‌కు నేరాలు కొత్తేమీ కాదు. ఆయనపై ఇప్పటికే ఐదు కేసులు నమోదై ఉన్నాయి. కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌లో రౌడీ షీట్‌ కూడా ఉంది. సూళ్లూరుపేటలో మోసం చేసినట్టుగానే 2023లో జిల్లాలో కూడా మోసం చేశారు. రూ.500నోట్ల కట్టలు అందిస్తే అంతకు పది శాతం కలిపి రూ. 2వేలు నోట్ల కట్టలు అందిస్తామని మాయమాటలు చెప్పి నరసన్నపేటకు చెందిన ఒకరిన్ని మోసం చేశారు. దానిపై కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌లో కేసు కూడా నమోదైంది. అదే తరహాలో సూళ్లూరుపేటలో మోసం చేసి పట్టుబడ్డారు. ఈయనపైనే కాదు ఆయన బంధువులపై కూడా రౌడీషీట్‌లు ఉన్నాయి.

శ్రీకాకుళం1
1/2

శ్రీకాకుళం

శ్రీకాకుళం2
2/2

శ్రీకాకుళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement