అక్రమ ఇసుక రవాణా నిలుపుదల | - | Sakshi
Sakshi News home page

అక్రమ ఇసుక రవాణా నిలుపుదల

Jun 29 2025 3:04 AM | Updated on Jun 29 2025 3:05 AM

ఆమదాలవలస రూరల్‌: ఇసుక అక్రమ రవాణాపై ‘సాక్షి’ వరుస కథనాలకు అధికారులు స్పందించారు. ఆమదాలవలస రూరల్‌ మండలం కొత్తవలస ఇసుక ర్యాంపు నుంచి ఇసుక లారీలు శనివారం పూర్తిగా నిలుపుదల చేశారు. అంతే కాకుండా దూసి రోడ్డు పొడవునా లారీల రాకపోకలు నిలిచిపో వటంతో రహదారి నిర్మానుష్యంగా దర్శనమిచ్చింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. కొత్తవలస గ్రామంలో విద్యుత్‌ తీగలను తాకేవిధంగా ఇసుక నిల్వ వేయటంతో ఇసుక ర్యాంపుల యజమానులకు విద్యుత్‌ శాఖాధికారులు హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. దారులన్నీ గోతులమయం కావడంతో దూసిపేట గ్రామానికి చెందిన ప్రజలు లారీలు కొంత సమయం నిలుపుదల చేయటమే కాకుండా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించడంతో లారీలు పూర్తిగా నిలిచిపోయాయి.

అక్రమ ఇసుక రవాణా నిలుపుదల1
1/2

అక్రమ ఇసుక రవాణా నిలుపుదల

అక్రమ ఇసుక రవాణా నిలుపుదల2
2/2

అక్రమ ఇసుక రవాణా నిలుపుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement