
తెలుగు వారి ధైర్యసాహసాలకు ప్రతీక రామ్గోపాల్ నాయుడు
టెక్కలి:
తెలుగు వారి ధైర్య సాహసాలకు ప్రతీకగా రామ్గోపాల్నాయుడు నిలిచారని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు. శనివారం సంతబొమ్మాళి మండలం నగిరిపెంట గ్రామంలో మేజర్ రామ్గోపాల్నాయుడును అభినందించి జ్ఞాపికను అందజే శారు. దేశరక్షణలో భాగంగా జమ్మూ కశ్మీర్ నియంత్రణ రేఖ వద్ద శత్రువులను మట్టుబెట్టి తన తోటి సైనికులను రక్షించడంలో రామ్గోపాల్నాయుడు చూపిన ధైర్య సాహసాలు నేటి యువతకు ఆదర్శ మని గుర్తు చేశారు. దేశంలో అత్యున్నత పురస్కా రం అందుకున్న తొలి తెలుగు వ్యక్తిగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన రామ్గోపాల్నాయుడు చరిత్ర సృష్టించారని కొనియాడారు. రామ్గోపాల్నాయుడును సన్మానించిన వారిలో వైఎస్సార్సీపీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్, కళింగ సామాజిక వర్గం రాష్ట్ర అధ్యక్షుడు దుంపల లక్ష్మణరావు, సంతబొమ్మాళి, టెక్కలి, కోటబొమ్మాళి జెడ్పీటీసీలు పాల వసంత్రెడ్డి, దువ్వాడ వాణి, దుబ్బ వెంకటరావు, నందిగాం ఎంపీపీ ఎన్.శ్రీరామ్మూర్తి పాల్గొన్నారు.