
అధికారులూ.. ఇదేం పద్ధతిప్రొటోకాల్ ఉల్లంఘనపై జెడ్పీ చైర
జూలై 3న వైఎస్సార్ సీపీ
సమావేశం
నరసన్నపేట: జిల్లా కేంద్రంలో జూలై మూడున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ఈ సమావేశానికి పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కురసాల కన్నబాబు, జిల్లా పరిశీలకులు కుంభా రవిబాబు ముఖ్య అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు. చంద్రబాబు హామీలను ప్రజలందరికీ గుర్తు చేసే లక్ష్యంతో వైఎస్సార్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా ‘రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమం జరగనుందని, దీనిపై ఆలోచనలు, కార్యాచరణ ఖరారు చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి నియోజకవర్గాల పార్టీ సమన్వయకర్తలు, మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.