
అధికారులూ.. ఇదేం పద్ధతి!
● ప్రొటోకాల్ ఉల్లంఘనపై
జెడ్పీ చైర్పర్సన్ విజయ మండిపాటు
● 15వ ఆర్థిక సంఘ నిధుల మళ్లింపుపై జెడ్పీటీసీల ఆగ్రహం
● టెక్కలిలో పారిశుద్ధ్య నిర్వహణ తీరుపై ధ్వజమెత్తిన దువ్వాడ వాణి
● వాడీవేడిగా జెడ్పీ సర్వసభ్య సమావేశం
అరసవల్లి:
జిల్లా పరిషత్ నిధులతో నిర్మిస్తున్న ఆర్డబ్ల్యూఎస్ పథకాల పనుల శంకుస్థాపన సమయంలో అధికారులు ప్రొటోకాల్ ఉల్లంఘించడంపై జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారుల తీరు తనకు మాత్రమే కాకుండా తన పదవి(చైర్)కే అవమానం జరిగినట్లు భావించాల్సి ఉంటుందని మండిపడ్డారు. శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ఖాన్, జెడ్పీ సీఈవో శ్రీధర్ రాజాల ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై వాడీవేడిగా చర్చ జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యేలు గొండు శంకర్, ఎన్.ఈశ్వరరావు, డీసీఎంఎస్ చైర్మన్ చౌదరి అవినాష్, డీసీసీబీ చైర్మన్ శివ్వాల సూర్యనారాయణ, ఉమ్మడి జిల్లా అధికారు లు పాల్గొన్నారు. కాగా ఈ కీలక సమావేశానికి అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు మిన హా మిగిలినవారెవ్వరూ హాజరుకాలేదు. ప్రజల సమస్యలపై జెడ్పీటీసీలు నిలదీస్తారేమో అనే ఇంటిలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలోనే మంత్రులు, విప్లు హాజరుకాలేదని సమాచారం.
●జిల్లాలో పంచాయతీలకు జమ కావాల్సిన 15వ ఆర్థిక సంఘ నిధులు ఎటుపోయాయని జెడ్పీ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహనరావు, జెడ్పీటీసీలు టొంపల సీతారాం, నాగేశ్వరరావు, కాయల రమణ, బెండి గోవిందరావు, దువ్వాడ వాణి, వంగ ర ఎంపిపి సురేష్ ముఖర్జీ తదితరులు అధికారులను నిలదీశారు. దీనిపై జెడ్పీ సీఈవో శ్రీధర్రాజా స్పందించి నిధులు పంచాయతీల ఖాతాలకు అడ్జస్ట్ అవుతాయని ప్రకటించారు. అనంతరం డీపీఓ భార తీ సౌజన్య పంచాయతీల ఆర్థిక నిధుల ఖాతాల్లో బాలెన్స్ల వివరాలను చదివి వినిపించారు.
●ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ నాగావళి కుడి ఎడమ కాలువల ఆధునీకరణ పను ల సంగతేంటని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో ఈ పనులకు రెండు దఫాలుగా నిధులు కేటాయించి ననా ఈ ప్రభుత్వం ఎందుకు పనులు మొదలు పెట్టలేదని జలవనరుల శాఖాధికారులను ప్రశ్నించారు. జిల్లా పరిషత్ పాలకులకు ఇంకో ఏడాదిన్నర సమయం మాత్రమే ఉందని, ఇప్పటికై నా జెడ్పీటీసీలకు నిధులు కేటాయించి వారి హక్కులను కాపాడేలా పనులు చేయించాలని కోరారు.
●శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మాట్లాడుతూ గార మండలంలో వత్సవలస, కళింగపట్నం, అంబళ్లవలస ఎత్తిపోతల పథకాల పనులు ఎప్పుడు పూర్తి చేస్తారని అధికారులను ప్రశ్నించారు. దీనిపై జలవనరుల శాఖాధికారులు స్పందిస్తూ వచ్చే నెల 15న నీరు అందిస్తామని సమాధానమిచ్చారు.
●ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్.ఈశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వం శ్రీకాకుళం కార్పొరేషన్లో ఎచ్చెర్ల పరిధిలోని కుశాలపురం, తోటపాలెం గ్రామ పంచాయతీలను విలీనం చేసిందని..దీంతో అక్కడి గ్రామీ ణ ప్రాంత ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని, మళ్లీ ఈ రెండు గ్రామాలను పంచాయతీలుగా మార్చేలా గెజిట్ తెస్తామని ప్రకటించారు. జల్జీవన్ మిషన్, ఉపాధి హామీ పనులకు కూడా ఈ రెండు గ్రామాలు అర్హత కోల్పోయాయని, అక్కడి గ్రామస్తుల వినతిమేరకు ఈ గెజిట్ విడుదలకు చర్యలు చేపట్టాలని సీఎం దృష్టికి తీసుకెళ్లామని వివరించారు.
సమాచారం ఇవ్వకపోవడం తగదు: జెడ్పీ చైర్పర్సన్ విజయ
వివిధ శాఖల ప్రగతి నివేదికల సమీక్షలో భాగంగా ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఇంజినీర్ లలితకుమారి మాట్లాడుతూ ఉద్దానం ప్రాజెక్టు విస్తరణ పనులను వివరించారు. ఇచ్ఛాపురం పట్టణానికి తాగునీటిని అందించే పనుల ప్రస్తావించగానే.. చైర్పర్సన్ విజయ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన పనులకు మళ్లీ శంకుస్థాపన చేయడమేంటని ప్రశ్నించారు. చైర్పర్సన్గా ఇచ్ఛాపురం నియోజకవర్గానికి చెందిన తనకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సమాచారం ఇవ్వకపోవడం తగదన్నారు. కంచిలి మండలంలో తాగునీటి పథకాలకు విద్యుత్ కనెక్షన్ కట్ చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్రోన్ల వినియోగంపై అక్కడి రైతులకు అవగాహన కల్పించాలని కోరారు.

అధికారులూ.. ఇదేం పద్ధతి!