
బాక్సింగ్లో మెరిసిన సత్య భార్గవ్
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాకు చెందిన జి.సత్య భార్గవ్ బాక్సింగ్లో మెరిశాడు. ఇటీవల హర్యానాలో జరిగిన 6వ జూనియర్ నేషనల్ బాక్సింగ్ చాంపియన్షిప్ – 2025 పోటీల్లో తృతీయ స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించాడు. ఈ పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎస్.దేవివరప్రసాద్ త్రుటిలో పతకం కోల్పోయాడు. టోర్నీ ముగించుకుని జిల్లాకు తిరిగొచ్చిన క్రీడాకారులను, డీఎస్ఏ కోచ్ ఎం.ఉమామహేశ్వరరావును డీఎస్డీఓ డాక్టర్ కై .శ్రీధర్ గవరావు శనివారం అభినందించారు. జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బీఏ లక్ష్మణ్ దేవ్, బలగ సీతారాం, వంగా మహేష్, సీనియర్ బాక్సర్లు హర్షం వ్యక్తం చేశారు.