
పోలీసు అధికారులకు ప్రశంసలు
శ్రీకాకుళం క్రైమ్ : ప్రాపర్టీ కేసుల ఛేదన, రికవరీ, ముద్దాయిల అరెస్టు, పనితీరు పాటు మరికొన్ని ముఖ్య కేసులను ఛేదించడంలో ప్రతిభ కనబర్చిన పోలీసు అధికారులను ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డి శనివారం ప్రశంసించారు. గత ఆరు నెలల్లో 84 ప్రాపర్టీ, గ్రేవ్ కేసులు, రెండు నెలల్లో 20 కేసుల్లో ప్రతిభ కనబర్చిన సీఐ సూర్యచంద్రమౌళి సారథ్యంలోని సీసీఎస్ పోలీసు బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రశంసాపత్రాలు అందజేశారు.
ఇటీవల ఛేదించిన కేసులివే..
మందస, సారవకోటలో బ్యాంకులకు వెళ్లిన ఇద్దరు వేర్వేరు వ్యక్తులు అమౌంట్ తీసుకుని వచ్చి కారు ఢిక్కీలో పెట్టడాన్ని చూసిన ఒడిశాకు చెందిన దున్న మనోజ్ వారిని దృష్టి మరల్చి ఓ చోట రూ.1.50 లక్షలు, మరో చోట రూ. 90 వేలు దొంగిలించాడు. కాశీబుగ్గలో 40 తులాల బంగారం, శ్రీకాకుళంలోని ఏసీబీ సీఐ హరి నివాస గృహంలో ఏడున్నర తులాల బంగారం కేసులతో పాటు మరో 14 కేసుల్లో ముద్దాయిలైన ముద్దాడ నర్సింగరావు (ఎచ్చెర్ల మండలం), పార్వతీపురం మన్యం జిల్లావాసిని పట్టుకోవడంలో కృషి చేశారు. ఉమెన్స్ కళాశాల ఆవరణలో విద్యార్థినిపై జరిగిన దాడి కేసు ఛేదనలో సీసీఎస్ సీఐ చంద్రమౌళితో పాటు శ్రీకాకుళం ఒకటో పట్టణ సీఐ పైడపునాయుడుకు ప్రశంసాపత్రం దక్కింది. వీరితో పాటు పాతపట్నం సీఐ రామారావు, సైబర్ సెల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు హరికృష్ణ, రాము, మధుసూదన్, గఫూర్, హెచ్సీ జగదాంబ, పోలీస్ కానిస్టేబుళ్లు ఉన్నారు.

పోలీసు అధికారులకు ప్రశంసలు