‘మా భూములు మాకు కావాలి’ | - | Sakshi
Sakshi News home page

‘మా భూములు మాకు కావాలి’

Jun 28 2025 5:55 AM | Updated on Jun 28 2025 7:43 AM

‘మా భ

‘మా భూములు మాకు కావాలి’

మందస: మందస మండలం చీపి పంచాయతీ పద్మపురం గ్రామంలో గిరిజనులు 60 ఏళ్లుగా భూములు సాగు చేస్తున్నారని, ఆ భూములపై లోన్లు కూడా తీసుకున్నారని, ఇప్పుడు ఆ భూ ములను పెత్తందారులు ఆక్రమించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమ సర్వే నంబర్లపై వేరే పేర్లు చూపిస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మార్వో ఆఫీస్‌కు శుక్రవారం వెళ్లగా ఈ భూములపై సర్వేయర్‌ను పంపించి సర్వే చేయిస్తామని చెప్పారని గిరిజనులు తెలిపారు. తమ భూములు తమకు ఇప్పించాలని కోరారు.

జిల్లా జైలు సందర్శన

శ్రీకాకుళం క్రైమ్‌ : గార మండల పరిధి అంపోలులో ఉన్న జిల్లా జైలును జిల్లా ప్రధాన న్యా యమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్‌ జునైద్‌ అహ్మద్‌ మౌలానా శుక్రవారం సందర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ (అమరావతి ) ఆదేశాల మేరకు ఖైదీల సత్ప్రవర్తన, వారి పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ దరఖాస్తులను పరిశీలించారు. ఖైదీలకు పెట్టే ఆహార నాణ్యతను పరిశీలించి పరిసర ప్రాంతాలను సందర్శించి జైలు అధికారులకు సూచనలందించారు.

సబ్‌జైల్‌లో సేవలపై జిల్లా జడ్జి ఆరా

నరసన్నపేట: స్థానిక సబ్‌జైల్‌ను జిల్లా జడ్జి జునైద్‌ అహ్మద్‌ మౌలానా శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రిమాండ్‌ ఖైదీలతో మా ట్లాడారు. జైలులో ప్రభుత్వ నిబంధనల మేర కు సేవలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. ఆహార పదార్థాలు అందుతున్న తీరు ను అడిగి తెలుసుకున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సామరస్యంగా మెలగాలని, వివాదాలకు దూరంగా ఉండాల ని సూచించారు. దురలవాట్లకు బానిసలు కా వద్దని అన్నారు. ఉచిత న్యాయవాది అవసరం ఉంటే ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన వెంట స్థానిక జూనియర్‌ సివిల్‌జడ్జి ఎస్‌.వాణి, సబ్‌జైల్‌ సూపరింటెండెంట్‌ వినయ్‌ తదితరులు ఉన్నారు.

పత్తిలో అంతర పంటల సాగుపై అవగాహన

కొత్తూరు: పత్తిలో అంతర పంటల సాగుపై ప్ర కృతి వ్యవసాయం రీజనల్‌ యూనిట్‌ సభ్యులు హేమసుందరరావు, ప్రకాశరావులతో పాటు పలువురు అవగాహన కల్పించారు. మండలంలోని బాడ్రగూడ గిరిజన గ్రామంలో నవధాన్యాల సాగును శుక్రవారం పరిశీలించారు.

‘మా భూములు మాకు కావాలి’ 1
1/1

‘మా భూములు మాకు కావాలి’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement