పీజీ సెట్‌ ఫలితాల్లో టెక్కలి విద్యార్థికి ఫస్ట్‌ ర్యాంక్‌ | - | Sakshi
Sakshi News home page

పీజీ సెట్‌ ఫలితాల్లో టెక్కలి విద్యార్థికి ఫస్ట్‌ ర్యాంక్‌

Jun 26 2025 6:25 AM | Updated on Jun 26 2025 12:15 PM

పీజీ సెట్‌ ఫలితాల్లో టెక్కలి విద్యార్థికి ఫస్ట్‌ ర్యాంక్‌

పీజీ సెట్‌ ఫలితాల్లో టెక్కలి విద్యార్థికి ఫస్ట్‌ ర్యాంక్‌

టెక్కలి: రాష్ట్రవ్యాప్తంగా బుధవారం విడుదలైన పీజీ సెట్‌ ఫలితాల్లో టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన తియాలు హారిక బోటనీ విభాగంలో మొదటి ర్యాంకు సాధించింది. ఒడిశా పర్లాకిమిడి సమీపంలో రామసాగరం గ్రామానికి చెందిన ధనుంజయరావు, శాంతి దంపతుల కుమార్తె హారిక టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇటీవలే డిగ్రీ పూర్తి చేసింది. తాజాగా వెలువడిన ఫలితాల్లో మొదటి ర్యాంకు రావడం పట్ల ప్రిన్సిపాల్‌ టి.గోవిందమ్మ, అధ్యాపకుడు డి.వాసుబాబు, కళాశాల సిబ్బంది అభినందించారు.

జనావాసాల్లోకి జింక 

సరుబుజ్జిలి: అటవీ ప్రాంతం కుచించుకుపోవడంతో జంతువులు మైదాన ప్రాంతాల బాటపడుతున్నాయి. బుధవారం సరుబుజ్జిలి మండలం మర్రిపాడు గ్రామం వైపు జింక రావడంతో స్థానిక వ్యక్తి వెంబడించాడు. దీంతో సమీపంలోని సవళాపురం జంక్షన్‌ వద్ద బురిడివలస కాలనీలో ఓ ఇంట్లోకి చొరబడింది. సమాచారం అందుకున్న అటవీసెక్షన్‌ అధికారి సాయిరాం సిబ్బందితో వచ్చి జింకను చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం సీతంపేట మండలం ఓండ్రుజ్వాల వద్ద విడిచిపెట్టారు.

కలెక్టర్‌ను కలిసిన ఎల్‌డీఎం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజర్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎం.శ్రీనివాసరావు బుధవారం కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌తో మాట్లాడుతూ లక్ష్యాలను చేరుకుని రైతులకు,ప్రజలకు సకాలంలో రుణాల అందిస్తామని తెలిపారు.

నేడు జిల్లాస్థాయి ఫెన్సింగ్‌ ఎంపిక పోటీలు

శ్రీకాకుళం న్యూకాలనీ : జిల్లా స్థాయి చైల్డ్‌ అండ్‌ మినీ ఫెన్సింగ్‌ ఎంపిక పోటీలు గురువారం నిర్వహిస్తున్నట్టు జిల్లా ఫెన్సింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బలభద్రుని రాజా ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం టౌన్‌ హాల్‌ వేదికగా అండర్‌–10, అండర్‌–12 విభాగాలలో బాలురు, బాలికలకు వేర్వేరుగా పోటీలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇక్కడ ఎంపికై న క్రీడాకారులను ఈ నెల 29న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించే ఏపీ రాష్ట్రస్థాయి పోటీలకి పంపిస్తామన్నారు. వ్యక్తిగత ఫెన్సింగ్‌ కిట్‌, జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డుతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు ఫెన్సింగ్‌ ఎన్‌ఐఎస్‌ కోచ్‌ జోగిపాటి వంశీ(సెల్‌: 7660874844)ను సంప్రదించాలని కోరారు.

కలెక్టర్‌ను కలిసిన ఎల్‌డీఎం1
1/1

కలెక్టర్‌ను కలిసిన ఎల్‌డీఎం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement