ప్రజల్లోకి ప్రభుత్వ వ్యతిరేకత | - | Sakshi
Sakshi News home page

ప్రజల్లోకి ప్రభుత్వ వ్యతిరేకత

Jun 26 2025 6:25 AM | Updated on Jun 26 2025 6:25 AM

ప్రజల

ప్రజల్లోకి ప్రభుత్వ వ్యతిరేకత

సమావేశంలో పాల్గొన్న ధర్మాన కృష్ణదాస్‌, కుంభా రవిబాబు, సీదిరి అప్పలరాజు, నర్తు రామారావు, గొర్లె కిరణ్‌కుమార్‌, పేరాడ తిలక్‌ తదితరులు

సమావేశానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి, జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ తదితరులు

నరసన్నపేట: జిల్లాలో పార్టీ బలంగా ఉందని, ఏడాది కూటమి పాలనపై వ్యక్తమైన వ్యతిరేకతను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహనరెడ్డికి తెలియజేశారు. తాడేపల్లిలో బుధవారం జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో అధినేతకు పార్టీ పరిస్థితిని వివరించారు. కూటమి పాలనపై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని, దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని, గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయాలని, కార్యకర్తలకు అండగా ఉంటూ వారిలో మనోధైర్యం పెంపొందించాలని పార్టీ అధినేత సూచించినట్లు కృష్ణదాస్‌ వివరించారు. కార్యక్రమానికి హాజరైన వారిలో పార్టీ శ్రీకాకుళం పార్లమెంట్‌ పరిశీలకుడు కుంభా రవిబాబు, ఎమ్మెల్సీ నర్తు రామారావు, జెడ్పీ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు రెడ్డి శాంతి, మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్‌, ఆమదాలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్‌ ఉన్నారు.

పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో

జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌

ప్రజల్లోకి ప్రభుత్వ వ్యతిరేకత 1
1/2

ప్రజల్లోకి ప్రభుత్వ వ్యతిరేకత

ప్రజల్లోకి ప్రభుత్వ వ్యతిరేకత 2
2/2

ప్రజల్లోకి ప్రభుత్వ వ్యతిరేకత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement