ఇరాన్‌పై దాడులను ఖండించాలి | - | Sakshi
Sakshi News home page

ఇరాన్‌పై దాడులను ఖండించాలి

Jun 26 2025 6:25 AM | Updated on Jun 26 2025 6:25 AM

ఇరాన్‌పై దాడులను ఖండించాలి

ఇరాన్‌పై దాడులను ఖండించాలి

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఇరాన్‌పై అమెరికా దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి తాండ్ర ప్రకాష్‌, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కొన్న శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు వామపక్షాల ఆధ్వర్వంలో శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్‌ జంక్షన్‌ వద్ద బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత్‌ అవలంభిస్తున్న సంప్రదాయ విదేశాంగ విధానానికి అమెరికా దాడులు విరుద్ధమని దుయ్యబట్టారు. ఇరాన్‌పై దాడితో క్రూడ్‌ ఆయిల్‌ సంక్షోభం వస్తుందని, దేశ ప్రజలపై తీవ్రమైన భారాలు పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం వెంటనే అమెరికా దాడులను ఖండించాలని డిమాండ్‌ చేశారు. ఇరాన్‌పై దాడులు అమెరికా స్వప్రయోజనాల కోసమేనని, ప్రపంచ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం లేదన్నారు. భారత్‌తో ఇరాన్‌ ఎల్లప్పుడూ స్నేహపూర్వకంగా వ్యవహరిస్తోందని గుర్తు చేశారు. ఈ దాడి ప్రపంచ శాంతి, సాధారణ ప్రజల జీవనోపాధిపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వామపక్ష నాయకులు ఆర్‌.ప్రకాశరావు, ఎ.సత్యం, ఎం.గోవర్దనరావు, ఎం.ఆదినారాయణమూర్తి, టి.తిరుపతిరావు, ఎ.లక్ష్మి, బి.సంతోష్‌, ఆర్‌.అరవింద్‌, ఎ.సోమశేఖర్‌, పి.జగ్గారావు, పి.జనార్దనరావు, ఎన్‌.సంతోష్‌, ఎంవీ రమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement