
జాబ్మేళాకు విశేష స్పందన
శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ (అటానమస్)కళాశాలలో నిర్వహించిన జాబ్మేళాలో 189 మంది అభ్యర్థులు వివిధ కంపెనీలకు ఎంపికయ్యారు. కళాశాలలో నోడల రిసోర్స్ సెంటర్, జవహర్ నాలెడ్జ్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో కెరీర్ సొల్యూషన్స్ సంస్థ నిర్వహించిన ఈ జాబ్మేళాకు జిల్లా నలుమూలల నుంచి 298 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వివిధ పరీక్షల అనంతరం 189 మందిని ఎంపిక చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ కింతలి సూర్యచంద్రరావు తెలిపారు. కార్యక్రమంలో జేకేసీ కో–ఆర్డినేటర్ శ్రీలక్ష్మి, కెరీర్ సొల్యూషన్స్ మేనేజర్ ప్రేమ్కుమార్, డాక్టర్ ఎస్.వాణికుమారి, డాక్టర్ ఎన్.రామకృష్ణ, అధ్యాపకులు పాల్గొన్నారు.