ప్రత్యేక రైలు సౌకర్యం కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేక రైలు సౌకర్యం కల్పించాలి

Jun 25 2025 7:08 AM | Updated on Jun 25 2025 7:08 AM

ప్రత్యేక రైలు సౌకర్యం కల్పించాలి

ప్రత్యేక రైలు సౌకర్యం కల్పించాలి

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): విజయవాడలో రాష్ట్ర సచివాలయం ఉన్నందున శ్రీకాకుళం జిల్లా ప్రజలు రాకపోకలు చేసేందుకు ఇచ్ఛాపురం నుంచి విజయవాడకు ప్రత్యేక రైలు సౌకర్యం కల్పించాలని ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే సలహా మండలి బోర్డు సభ్యుడు డాక్టర్‌ బుడుమూరు రాజేష్‌ కోరారు. విశాఖపట్నం డివిజనల్‌ రైల్వే మేనేజర్‌తో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేష్‌ మాట్లాడుతూ శ్రీకాకుళంలో రాత్రి బయలుదేరి విజయవాడలో ఉదయం దిగేలా, తిరిగి విజయవాడలో రాత్రి బయలుదేరి ఇచ్ఛాపురం ఉదయం చేరుకునేలా సౌకర్యం కల్పించాలని విన్నవించారు. దీనికి డివిజనల్‌ మేనేజర్‌ అంగీకరించినట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement