
● జూలై 5న జాతీయ లోక్ అదాలత్
శ్రీకాకుళం పాతబస్టాండ్: జాతీయ లోక్ అదాలత్ను జూలై 5న నిర్వహించనున్నామని, ఇందులో ఎక్కువ కేసులు రాజీ చేయాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా అన్నారు. మంగళవారం స్థానిక జిల్లా కోర్టు భవనంలో పోలీస్ అధికారులు, ఎకై ్సజ్ అధికారులు, బీమా న్యాయవాదులు, చిట్ఫండ్ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈసారి కూడా ఎక్కువ కేసులు పోలీసు వారి దగ్గర నుంచి రావాలని కోరారు. కార్యక్రమంలో ఒకటో అదనపు జిల్లా జడ్జి పి.భాస్కర రావు, 3 వ అదనపు జిల్లా జడ్జి వివేక్ ఆనంద్ శ్రీనివాస్, 4 వ అదనపు జిల్లా జడ్జి ఎస్ ఎం ఫణి కుమార్, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎం.శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.