
బడి బయట ఉన్న పిల్లల్ని గుర్తించేలా..
శ్రీకాకుళం న్యూకాలనీ: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలను పెంచేందుకు ఎట్టకేలకు ప్రభుత్వం మొద్దునిద్రను వీడింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు జూలై 12 వరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ–సమగ్ర శిక్షా అభియాన్ నిర్ణయించింది. అర్హత కలిగిన 6 నుంచి 14 ఏళ్ల పిల్లలందర్నీ పాఠశాలల్లో చేర్పించాలని సూచించారు. డ్రాప్బాక్సులో, బడి బయట ఉండే పిల్లల్ని గుర్తించి వారందరూ బడిలో ఉండేలా చూడాలని తెలిపింది. జిల్లాలో బడి బయట ఉన్న పిల్లల్ని గుర్తించి బడులకు చేరువ చేసేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్ ఎస్.శశిభూషణ్ పేర్కొన్నారు.
శ్రీముఖలింగం హుండీ ఆదాయం రూ.3.32 లక్షలు
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో గడిచిన 112 రోజులకు గాను హుండీ ఆదాయం రూ.3,32,883 వచ్చినట్లు ఆలయ ఈఓ పి.ప్రభాకరరావు మంగళవారం తెలిపా రు. పర్యవేక్షణ అధికారి ఆమదాలవలస గ్రూప్ టెంపుల్ అధికారి టి.రవితోపాటు కొమనాపల్లి సత్యసాయి భజన మండలి అధ్యక్షులు పైడి శెట్టి వెంకటరమణ, అర్చకులు వెంకటాచలం,ధనాల స్వామి,భక్తులు పాల్గొన్నారు.
‘ఆ భూములు పేదలకే చెందాలి’
బూర్జ: పేదల సాగులో ఉన్న భూములు పేదలకే చెందాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలో గల అన్నంపేట గ్రామ రెవెన్యూ పరిధిలో గల వ్యవసాయ భూముల ను ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు 70 ఏళ్లుగా 25 దళిత, బలహీన వర్గాలకు చెందిన కుటుంబాలు సాగు చేస్తున్న భూములు వారికే చెందే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ ప్రాంతంలో థర్మల్ పవర్ ప్లాంట్ వస్తుందనే పేరుతో విశాఖపట్టణానికి చెందిన మంగపల్లి సూర్యప్రకాశరావు ఇక్కడ ఉన్న నాయకుల అండదండలతో ఈ సాగులో ఉన్న భూములు తొలగించి కోట్ల రూపాయలకు అమ్ముకోడానికి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బాధితులంతా జిల్లా వ్యవసా య కార్మిక సంఘ కార్యదర్శి గంగరాపు సింహాచలంను సంప్రదించడంతో గడచిన నెల రోజుల నుంచి పెద్ద ఎత్తున పోరాటాలు చేసి, ఏరువాక కార్యక్రమం చేపట్టి విత్తనాలు వేశా రు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘ కార్యదర్శి గంగరాపు సింహాచలం, మండలనాయకులు అప్పలనాయుడు, మామిడి కిరణ్, స్థానికులు, బలహీన వర్గాల ప్రజలు పాల్గొన్నారు.

బడి బయట ఉన్న పిల్లల్ని గుర్తించేలా..