ఇలా అయితే పిల్లల్ని పంపించం | - | Sakshi
Sakshi News home page

ఇలా అయితే పిల్లల్ని పంపించం

Jun 25 2025 1:18 AM | Updated on Jun 25 2025 1:18 AM

ఇలా అయితే పిల్లల్ని పంపించం

ఇలా అయితే పిల్లల్ని పంపించం

మండల కేంద్రంలోని నందికొండ కాలనీ ప్రాథమిక పాఠఽశాలలో 42 మంది విద్యార్థులు ఉన్నారు. ముగ్గురు ఉపాధ్యాయుల్లో ఒకరిని అకారణంగా బదిలీ చేశారని, మళ్లీ ఉపాధ్యాయుడిని నియమించే వరకు తమ పిల్లల్ని పాఠశాలకు పంపించబోమని పాఠశాల విద్యాకమిటీ చైర్మన్‌ మండ సుదర్శనరావు తెలిపారు. ఈ మేరకు విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి మంగళవారం మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. విద్యార్థులు అధికంగా ఉన్నచోట ఉపాధ్యాయులను తగ్గించి, పిల్లలు లేని చోట్ల నియామకం చేసి విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. ఈ తీరు వల్ల పిల్లలు ప్రైవేటు విద్యా సంస్థలకు వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు. అధికారులు పునరాలోచన చేసి ఉపాధ్యాయుడిని నియమించేవరకు తమ పిల్లలను పాఠశాలకు పంపింబోమని స్పష్టం చేశారు. అనంతరం ఎంఓఈ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. –సరుబుజ్జిలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement