
పూరీ రథయాత్రకు ప్రత్యేక రైళ్లు
పూరీలో నిర్వహించనున్న జగన్నాథ స్వామి రథయాత్రకు శ్రీకాకుళం రోడ్(ఆమదాలవలస) మీదుగా ప్రత్యేక రైళ్లు నడిపించేందుకు రైల్వే అధికారులు చర్యలు చేపట్టినట్లు శ్రీకాకుళం రోడ్ రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27వ తేదీన 08445 నంబర్ గల రైలు జగదల్పూర్ నుంచి పూరీ వరకు ప్రయాణించనుంది. ఈ రైలు విజయనగరం మీదుగా శ్రీకాకుళం రోడ్ను కలుపుకుంటూ ప్రయాణిస్తుందని తెలిపారు. మళ్లీ 28వతేదీన పూరీలో బయల్దేరి 08446 నంబర్గల విశాఖప ట్నం–పూరీ– విశాఖపట్నం రైలు శ్రీకాకుళం మీదుగా ప్రయాణిస్తుందని పేర్కొన్నారు. అలాగే జూన్ 27, 28, జూలై 5, 6 తేదీల్లో 08314 నంబరు గల ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ రైలు శ్రీకాకుళం రోడ్ (ఆమదాలవలస)కు ఉదయం 2.51 గంటలకు చేరనుందని తెలిపారు. ఈ రైలు కోటబొమ్మాళి, పలాస, మందస, సోంపేట, ఇచ్చాపురం స్టేషన్లలో ఆగుతుందని వివరించారు. –ఆమదాలవలస