
రాష్ట్ర అధ్యక్షుడిగా కిల్లాన
శ్రీకాకుళం: జాతీయ బీసీ సంక్షేమ సంఘం బీసీ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షుడిగా కిల్లాన శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లాకా వెంగళరావు యాదవ్ సోమవారం నియామక ఉత్తర్వులు అందించారు. ఎస్ఐసీ అభివృద్ధి అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేసిన శ్రీనివాసరావు గత ఐదు సంవత్సరాలుగా బీసీ సంఘంలో పనిచేస్తూ సంఘ అభివృద్ధికి, పటిష్టతకు కృషి చేశారు. తనను నియమించిన జాతీయ, రాష్ట్ర నాయకత్వానికి శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు.
డాబా పైనుంచి జారిపడి
వృద్ధుడు మృతి
బూర్జ: మండలంలోని డొంకలపర్త గ్రామానికి చెందిన జడ్డు అప్పలనాయుడు (67) డాబా పైనుంచి జారిపడి సోమవారం మృతి చెందినట్లు గ్రామస్తులు, కుటుంబీకులు తెలియజేశారు. వివరాల్లోకి వెళ్తే.. మృతుడు జడ్డు అప్పలనాయుడు ఉదయాన్నే ఇంటి డాబాపైకి వెళ్తుండగా కళ్లు తిరిగి పైనుంచి కిందకి పడిపోవడంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య లచ్చమ్మ, నలుగురు కుమారులు ఉన్నారు. భార్య లచ్చమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎస్పీ గ్రీవెన్సుకు 58 ఫిర్యాదులు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ మరియు పరిష్కార వేదిక (గ్రీవెన్సు)కు ప్రజల నుంచి 58 అర్జీలు అందాయి. అదనపు ఎస్పీ కె.వి.రమణ అర్జీలు స్వీకరించి సకాలంలో పరిష్కరించేలా చూస్తామని భరోసా ఇచ్చారు.

రాష్ట్ర అధ్యక్షుడిగా కిల్లాన