
బంగారం చోరీ
నందిగాం: మండల కేంద్రమైన నందిగాం గణేష్ కాలనీలోని ఒక ఇంట్లో బంగారం చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గణేష్ కాలనీలో నివాసముంటున్న కృష్ణవేణి లఖిదాసుపురం సచివాలయంలో ఏఎన్ఎంగా పని చేస్తుంది. ఆదివారం తన ఇంటికి తాళం వేసి హరిదాసుపురంలో ఉన్న కన్నవారింటికి వెళ్లింది. తిగిరి సోమవారం సాయంత్రం ఇంటికి వచ్చి చూడగా కొన్ని వస్తువులు చిందరవందరగా ఉండడాన్ని గమనించింది. అనుమానంతో బెడ్రూమ్ తలుపు తీయగా అక్కడ ఉన్న కిటికీ గ్రిల్ సగం తీసి వేసి ఉంది. మరో గదిలో ఉన్న ఇనుప బీరువాను చూడగా బీరువా తలుపు వంచి ఉండటం గమనించి చూడగా, లోపల ఉండాల్సిన బంగారం కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చింది. టెక్కలి సీఐ శ్రీనివాసరావు కృష్ణవేణి ఇంటిని పరిశీలించి, క్లూస్ టీమ్ను రప్పించి వేలి ముద్రలు సేకరించారు. సుమారు 16 తులాల బంగారు ఆభరణాలు, వెండి చెంబు, గ్లాసు, పళ్లెం తదితర వస్తువులు పోయినట్లు తెలిపింది.