
గొట్టాను పరిశీలించిన ఒడిశా అధికారి
హిరమండలం: స్థానిక గొట్టా బ్యారేజీ స్థితిగతులను భువనేశ్వర్కు చెందిన చీఫ్ ఇంజనీర్ నాగమోహన్ గురువారం పరిశీలించారు. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దు జలాల వివాదాల నేపథ్యంలో ఒడిశా చీఫ్ ఇంజినీర్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. గొట్టా బ్యారేజీలో ఇన్ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను తెలుసుకున్నారు. ఈ బ్యారేజీ ద్వారా సాగునీటి ప్రవాహంతో పాటు కుడి, ఎడమ ప్రధాన కాలువల పరిస్థితిపై ఆరా తీశారు. ఏటా ఖరీఫ్, రబీ సాగు లక్ష్యాన్ని సైతం తెలుసుకున్నారు. స్థానిక వంశధార అధికారులు ఇక్కడి పరిస్థితిని వారికి వివరించారు. ఆయన వెంట నరసన్నపేట వంశధార డీఈ ప్రదీప్, ఇతర వంశధార సిబ్బంది పాల్గొన్నారు.