
టీసీలు తీసుకోమంటారా..?
షాపు తొలగిస్తారా..
ఇచ్ఛాపురం రూరల్: 280 మందికి పైగా విద్యా ర్థులు, 15 మంది ఉపాధ్యాయులు ఉన్న ఈదుపురం ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఒక్క విద్యార్థి కూడా కనిపించలేదు. ఒక్కరు కూడా రాకపోవడంతో ఉపాధ్యాయులు నుంచి మండల విద్యాశాఖాధికారి వరకు అంతా ఆందోళన చెందారు. ఒకే సారి వందలాది మంది విద్యార్థులు బడికి రాకుండా బాయ్కాట్ చేయడంతో ఉపాధ్యాయులు విద్యార్థుల ఇళ్లకు పరుగులు తీసి ఆరా తీశారు. అందరి తల్లిదండ్రులదీ ఒకటే మాట... ‘మా పిల్లలు బడిలోకి అడుగు పెట్టాలంటే.. బడికి ఆనుకొని ఉన్న మద్యం షాపును తొలగించాలి. అంత వరకు సాక్షాత్తు కలెక్టర్ మా దగ్గరికి వచ్చినా పిల్లల్ని బడికి పంపించేది లేదు’. అంటూ తెగేసి చెప్పారు. దీంతో చేసేదేమీ లేక ఉపాధ్యాయులు బడికి తిరుగు ముఖం పట్టారు.
ఈదుపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు ఆమడ దూరంలో నాలుగు రోజుల కిందట ఎకై ్సజ్ అధికారులు అనుమతులు ఇచ్చి కొత్త ప్రభుత్వ మద్యం షాపును తెరిచారు. దీంతో ఈదుపురం గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాలు నీలాపుట్టుగ, కేశుపురం, ఈదుపురం, సన్యాసిపుట్టుగ గ్రామ ప్రజలు అభ్యంతరం తెలిపారు. పోలీసులతో పాటు ఎకై ్సజ్ సిబ్బంది సైతం మద్యం షాపు నిర్వాహకులకే వత్తాసు పలకడంతో గురువారం విద్యార్థుల తల్లిదండ్రులు మద్యం షాపును తొలగించాలంటూ ఆందోళన వ్యక్తం చేశారు. అయినప్పటికీ అటు ప్రభుత్వం నుంచి గానీ, ఇటు ప్రజా ప్రతినిధుల నుంచి గానీ ఎలాంటి సమాధానం రాకపోవడంతో శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లల్ని బడికి పంపించకుండా బాయ్కాట్ చేశారు. విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖాధికారి–2 ఎస్.విశ్వనాథం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడగా.. మద్యం షాపును తొలగించే వరకు తమ పిల్లల్ని బడికి పంపించేది లేదని, సోమవారం నుంచి బడి నుంచి టీసీలు తీసుకువెళ్లిపోతామంటూ విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించారు.
బడికి రాని ఈదుపురం ఉన్నత పాఠశాల విద్యార్థులు
మద్యం షాపు తొలగిస్తేనే స్కూలుకు
పంపిస్తామన్న తల్లిదండ్రులు
ఉన్నతాధికారులకు నివే దించా..
మద్యం షాపును తొలగించే వరకు విద్యార్థులను బడికి పంపించేది లేదని తల్లిదండ్రులు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టిలో పెట్టాను.
– తమ్మయ్య, హెచ్ఎం

టీసీలు తీసుకోమంటారా..?