
ఎన్పీసీఐ లింకు తప్పనిసరి: కలెక్టర్
శ్రీకాకుళం పాతబస్టాండ్: తల్లికి వందనం పథకం ప్రయోజనాలను విద్యార్థులు సకాలంలో పొందాలంటే తమ బ్యాంకు ఖాతాలను జాతీయ చెల్లింపుల సంస్థ(ఎన్పీసీఐ)తో అనుసంధానం చేయించుకోవడం అత్యవసరమని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. షెడ్యూల్డు కులాల 9వ, 10వ తరగతుల్లో చదువుతున్న విద్యార్థులకు అందే నిధులను వారి తల్లుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. అంతేకాక, ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు నిధులు వారి వ్యక్తిగత ఖాతాల్లోకి జమ కానున్నాయి. తల్లులు, విద్యార్థులు తమ ఖాతాలను వెంటనే జాతీయ చెల్లింపుల సంస్థతో అనుసంధానం చేయించుకోవాలని ఆయన సూచించారు. ఖాతా లేకపోతే తపాలా కార్యాలయంలో పోస్ట్ కార్యా లయ ఖాతా తెరిచి, దాన్ని కూడా తగిన విధంగా అనుసంధానం చేయించుకోవాలన్నారు. జిల్లాలో ఇప్పటికీ 1360 మంది విద్యార్థులు ఖాతాలను అనుసంధానం చేయించుకోలేదని కలెక్టర్ తెలిపారు. పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ఖాతా అనుసంధానం తప్పనిసరిగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
కూటమికి సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు
నరసన్నపేట: కూటమి ప్రభుత్వం అక్రమ అరెస్టులకు సుప్రీం కోర్టు తీర్పు చెంప పెట్టు వంటిదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఓ ప్రకటనలో తెలిపారు. సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరుపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. కొమ్మినేనిని అకార ణంగా కూటమి ప్రభుత్వం అరెస్టు చేసిందని మండిపడ్డారు.ఎల్లో మీడియా గ్యాంగుతో కలిసి కొమ్మినేనిపై తప్పుడు ఆరోపణలు చేసి విష ప్రచారం చేశారని అన్నారు. కొమ్మినేనికి బెయి ల్ ఇచ్చి సుప్రీం కోర్టు తగిన బుద్ధి చెప్పిందన్నా రు. ‘సాక్షి’ మీడియా ఆస్తులను కూటమి నాయ కులు ధ్వంసంపై చేయడాన్ని ఖండించారు.
కూటమి హామీలన్నీ ఏమయ్యాయి..?
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): ఎన్నికల ముందు కూటమి ఇచ్చిన హామీలు ఏమయ్యాయ ని వైఎస్సార్సీపీ కళింగకుల రాష్ట్ర అధ్యక్షుడు దుంపల రామారావు (లక్ష్మణరావు) ప్రశ్నించారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. తల్లికి వందనంలో కోత పెట్టడం సరికాదన్నారు. పేద విద్యార్థుల చదువు కోసం దివంగత వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్కు ప్రభు త్వం పంగనామం పెట్టిందని ఆరోపించారు. ఉచిత బస్సు లేదు, అన్నదాత సుఖీభవ లేదు, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీ, బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ లేదని మండిపడ్డారు. చేసిన తప్పులు ఎత్తిచూపే సాక్షి మీడియా, సాక్షి కార్యాలయాలపై దాడి చేసి ఆస్తులు ధ్వంసం చేయడం దారుణమన్నారు.
‘ఏడాది పాలనంతా మోసం’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): కూటమి ప్రభుత్వం ఏడాది పాలనంతా మోసమేనని వైఎస్సార్సీపీ రాష్ట్రకార్యదర్శి కిల్లి వెంకటగోపాల సత్యనారాయణ అన్నారు. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 5.32లక్షల మంది రైతులకు అన్నదాత సుఖీభవ పేరు మార్చినా నగదు రాలేదన్నారు. ఇప్పటికే ఒక ఏడాది ఎగ్గొట్టేశారని తెలిపారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా ఈ ఏడాది తొలి విడత డబ్బులు కూడా ఇవ్వకపోవడం అన్యాయయమన్నారు. రెడ్బుక్ రాజ్యాంగానికి ఇచ్చిన ప్రాధాన్యత మరే ఇతర సంక్షేమానికి ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. వెన్నుపోటు చంద్రబాబుకి కొత్తేమీ కాదని అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఇలానే మోసం చేయడం, ప్రజలకిచ్చిన హామీలు అమలుచేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు.

ఎన్పీసీఐ లింకు తప్పనిసరి: కలెక్టర్

ఎన్పీసీఐ లింకు తప్పనిసరి: కలెక్టర్