
ఆటో గ్యాంగ్ ఆటకట్టు
శ్రీకాకుళం క్రైమ్ : జిల్లాకేంద్రంలో ఇటీవల రెచ్చిపోయిన ఆటో గ్యాంగ్ ఆటను పోలీసులు కట్టించారు. ఈ గ్యాంగ్కు సంబంధించి విజయనగరం జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు, ఓ వ్యక్తిని రెండో పట్టణ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే..
వృద్ధదంపతులను ఏమార్చి..
ఈ నెల 5న ఎచ్చెర్ల మండలం కొత్తపేట పంచాయ తీ సాకివానిపేటకు చెందిన వృద్ధ దంపతులు కోరా డ రమణ, రామలక్ష్మిలు శ్రీకాకుళంలో ఆటోలో ప్రయాణిస్తుండగా పుస్తెలతాడు దొంగిలించారు. అదే రోజు వృద్ధ దంపతులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండో పట్టణ ఎస్ఐ రామారావు దర్యాప్తు ప్రారంభించారు. శుక్రవారం వాహన తనిఖీల్లో భాగంగా తోటపాలెం జంక్షన్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఎస్ఐ రామారావు, సిబ్బందికి సరిగ్గా ఉద యం పది గంటల సమయంలో ఏపీ 30విడి440 నంబరు గల బజాజ్ మాక్సిమా ఆటో మీద వస్తున్న మహిళలపై అనుమానం కలగడంతో వెంటనే అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. విచారణలో విజయనగరం జిల్లా మెంటాడ మండలం పెట్టాడ గ్రామానికి చెందిన గొర్లె మౌనిక, గొర్లె పెద్దింట్లమ్మ, అదే జిల్లా కొత్తవలస మండలం చీడివలసకు చెందిన ఆటో డ్రైవర్ మేకల హరిలుగా పోలీసులు గుర్తించారు. పెద్దింట్లమ్మ, మౌనికలు తల్లీ కూతుళ్లు కాగా, హరి పెద్దింట్లమ్మకు మేనల్లుడు అవుతాడు.
లెక్కకు మించి కేసులు..
వీరిపై ఇతర జిల్లాల్లో, మన జిల్లాలోని రూరల్తో కలిపి పదికి మించి కేసులున్నాయని ఎస్ఐ రామారావు తెలిపారు. వీరిదో గ్యాంగు అని, ఈ కేసుకు సంబంధించి వీరే నిందితులని, గ్యాంగులో మరికొందరు ఉండొచ్చని ఎస్ఐ పేర్కొన్నారు. నిందితు ల నుంచి ఆటోను, బంగారాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరించామన్నారు.
పోలీసులకు దొరికిన ఆటో గ్యాంగ్
నిందితులు విజయనగరం వాసులు