ఇన్ని ఆంక్షలా..?
ఖాతాలో రూ.15 వేలు వేస్తామని, ఇప్పుడు రూ.13 వేలు వేయడం అన్యాయం. నిబంధనలు పెట్టి తల్లుల ఖాతాలో నగదు వేయకపోవడం, భూములు, విద్యుత్ బిల్లులతో అనేక కొర్రీ లు పెట్టాలనుకోవడం దారుణం. ఇప్పటికై నా చదువుకునే విద్యార్థులందరికి తల్లికి వందనం వర్తింపు చేయాలి.
– దాంపురం రాజ్యలక్ష్మి, రంకిణి గ్రామం, పాతపట్నం
తల్లికి వందనం అందలేదు
నా పిల్లలు ఇంటర్ చదువుతున్నారు. నా భర్త మదన్ సర్పంచ్ కావడంతో మాకు తల్లికి వందనం ఇవ్వలేదు. మాకు భూములు లేవు, పెద్దగా ఇతర ఆస్తులు లేవు. అయినా ఎందుకో మా మీద కక్ష గట్టి ఆపినట్టు ఉంది.
– తామాడ జ్యోత్స్న,
గృహిణి, బొడ్డపాడు, పలాస మండలం
గతంలో ఈ నిబంధన లేదు
కూటమి ప్రభుత్వం సర్పంచ్ ను ప్రభుత్వ ఉద్యోగిగా గుర్తించి తల్లికి వందనం అనర్హత జాబితాలో సర్పంచ్ల పేర్లు పెట్టింది. గత ప్రభుత్వంలో ఇలాంటి నిబంధన లేదు. – సంది సోనియా, రుషికుడ్డ సర్పంచ్
● తల్లికి వందనం ఆంక్షలపై లబ్ధిదారుల్లో వ్యతిరేకత
● సర్పంచ్లుగా ఉన్న తల్లులను సైతం అనర్హులుగా ప్రకటించిన ప్రభుత్వం
● మొదటి ఏడాది బకాయిలపై లేని స్పష్టత
శ్రీకాకుళం న్యూకాలనీ:
కూటమి సర్కారు సంక్షేమానికి ఆంక్షల సంకెళ్లు విధించింది. ఎలాగోలా లబ్ధిదారుల సంఖ్య తగ్గించడమే లక్ష్యంగా తల్లికి వందనంపై సవాలక్ష ఆంక్షలు పెట్టింది. ఒక చేత్తో డబ్బులు ఇస్తూ.. రెండో చేత్తో లబ్ధిదారుల సంఖ్యను కుదించేస్తోంది. ఎన్నికల సమయంలో నీకు రూ.15వేలు నీకు రూ.15వేలు అని ప్రచారం చేసి ఇప్పుడు రూ.13వేలకు పరిమితం చేశారు. వైఎస్ జగన్ హయాంలో స్కూలు బాగోగుల కోసం అమ్మ ఒడి నిధులు కేటాయిస్తే మైకు పట్టుకుని విమర్శించిన నాయకులు ఇప్పుడు మౌనంగా అదే పనిచేస్తూ దొరికిపోయారు.
కోతల కోసం ఎన్నో కుయుక్తులు..
జిల్లాలో గత ఏడాది ఒకటి నుంచి ఇంటర్(+2) వరకు 3.05లక్షల మంది చదువుకున్నారు. వీరిందరికి కలిపి మొదటి ఏడాది రూ.457 కోట్ల నిధులను కూటమి ప్రభుత్వం బాకీ పడి ఉంది. ప్రస్తుతం యూ–డైస్ లెక్కల ప్రకారం ఒకటి నుంచి పదో తరగతి వరకు 2,76,593 మంది, అలాగే ఇంటర్మీడియెట్ 46,761 మంది చదువుతున్నారు. ఒకటి నుంచి ఇంటర్ మొత్తం కలిపి 3,02460 మంది ఉన్నా రు. వీరిలో బాలురు 1,54,966 మంది, బాలికలు 1,47,494 మంది ఉన్నట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. అయితే వీరిలో ఎంత మందికి డబ్బులు పడతాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. నిబంధనల చిట్టా విడుదల చేయడంతో డబ్బులు పడని అర్హులంతా ఆందోళన చెందుతున్నారు.
ని‘బంధనాలు’
● కూటమి అధికారం చేపట్టి ఏడాది గడిచిపోయింది. తాజాగా రెండో ఏడాదికి సంబంధించి తల్లికి వందనం పథకం అమలుకు సంబంధించి జీఓ మాత్రమే విడుదల చేశారు. అంటే మొదటి ఏడాదికి ఇక లేనట్టే.
● వింతగా గత విద్యా సంవత్సరం డేటా తీసుకున్నప్పటికీ.. ప్రస్తుత విద్యా సంవత్సరాన్ని మాత్ర మే పరిగణనలోకి తీసుకున్నారు.
● ప్రభుత్వ లెక్క ప్రకారం చూస్తే ఇటీవల టెన్త్ పరీక్షలు రాసి ఇంటర్లో చేరిన విద్యార్థులకు మాత్ర మే లబ్ధి చేకూరనుంది. పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సుల్లో చేరినవారు అనర్హులు కానున్నారు. అలాగే ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులను కూడా అనర్హులుగా పరిగణించారు.
● వేసవిలో కాసింత ఎక్కువ కరెంటు వాడి ఉంటే ఇక అంతే సంగతి. 300 యూనిట్లు దాటిన వారిని అనర్హులుగా ప్రకటించారు.
● ముఖ్యంగా గ్రామాల్లో సర్పంచ్లను సైతం అనర్హులుగా ప్రకటించారు.
● వారికి నెలవారీ జీతాలు సీఎఫ్ఎంఎస్ ద్వారా చెల్లింపులు జరుగుతుండటంతో వారిందరినీ అనర్హులుగా ప్రకటించారు. గతంలో వైఎస్ జగన్ హయాంలో ఇలాంటి కోతలు లేవు.
శ్రీకాకుళం (పీఎన్కాలనీ): ఎన్నికల సమయంలో తల్లికి వందనం కింద రూ.15వేలు ఇస్తానని చెప్పిన నాయకులు పాఠశాల అభివృద్ధి పేరుతో రూ.2వేలు కోత పెట్టడం దుర్మార్గమని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్య దర్శి డి.చందు అన్నారు. దీనిపై నిరసన తెలుపుతూ శ్రీకాకుళం నగరంలో సూర్యమహల్ జంక్షన్ నుంచి సెవెన్ రోడ్ జంక్షన్ వరకు 200 మంది విద్యార్థులతో శుక్రవారం భారీర్యాలీ నిర్వహించారు. కుటుంబఆదాయం గ్రామాల్లో నెలకు రూ. 10వేలు, పట్టణాల్లో రూ.12వేల లోపు ఉండాలని, రైస్ కార్డు ఉండాలని, ఫ్యామిలీకి 3 ఎకరాల్లోపు మాగాణి, లేదా 10 ఎకరాల్లోపు పొడి భూమి, లేదా రెండూ కలిపి 10 ఎకరాల్లోపు ఉండాలని, ఫోర్ వీలర్స్ ఉండకూడదని నిబంధనలు పెట్టడం అన్యాయమన్నారు. చాలా మందికి సాంకేతిక సమస్యలంటూ ఎగ్గొట్టే ప్రయ త్నం చేస్తున్నారని తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
● తల్లికి వందనంలో కోత సిగ్గు చేటు
● తల్లికి వందనంలో కోత సిగ్గు చేటు
● తల్లికి వందనంలో కోత సిగ్గు చేటు
● తల్లికి వందనంలో కోత సిగ్గు చేటు

● తల్లికి వందనంలో కోత సిగ్గు చేటు

● తల్లికి వందనంలో కోత సిగ్గు చేటు

● తల్లికి వందనంలో కోత సిగ్గు చేటు