నవోదయ 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు | - | Sakshi
Sakshi News home page

నవోదయ 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు

Jun 13 2025 7:13 AM | Updated on Jun 13 2025 7:13 AM

నవోదయ

నవోదయ 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు

సరుబుజ్జిలి: వెన్నెలవలస వద్ద గల జవహర్‌ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ఎంట్రన్స్‌ కోసం జూలై 29లోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ బేతనసామి గురువారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఎంట్రన్స్‌ పరీక్ష 2025 డిసెంబర్‌ 13న జిల్లాలో ఎంపిక చేసిన కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. దరఖాస్తుదారులు ప్రభుత్వ లేదా ప్రభుత్వంతో గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2025–26 విద్యాసంవత్సరంలో 5వ తరగతి చదివి ఉండాలని తెలిపారు.

ప్రధానమంత్రి బాల పురస్కార్‌ దరఖాస్తుకు గడువు పెంపు

శ్రీకాకుళం అర్బన్‌: జాతీయ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ ఆ ధ్వర్యంలో నిర్వహించే ప్రధాన మంత్రి రాష్ట్రీ య బాల పురస్కార్‌–2025కి సంబంధించి దరఖాస్తుల గడువును జూలై 31 వరకు పొడిగించారని జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పథక సంచాలకులు బి.శాంతిశ్రీ తెలిపారు. ఈ మేరకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ తాజా ఉత్తర్వులు జారీ చేసినట్లు పేర్కొన్నారు. సాంస్కృతికం, సమాజ సేవ, విజ్ఞానం, సాంకేతికం, పర్యావరణం వంటి రంగాలలో అసాధారణ ప్రతిభ కనబర్చిన 5–18 ఏళ్ల లోపు బాలలు ఈ అవార్డుకు అర్హులని తెలిపారు. బాలలు స్వయంగా గానీ సంస్థల ద్వా రా గానీ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నా రు. దరఖాస్తు చేసేందుకు అవసరమైన వ్యక్తిగత వివరాలు, ప్రతిభకు సంబంధించిన ధ్రువపత్రాలు, సర్టిఫికెట్లు, పత్రికల్లో ప్రచురితమైన వార్తల క్లిప్పింగ్స్‌ వంటి ఆధారాలతో పాటు http://awards.gov.in/registration/ signUp పోర్టల్‌ ద్వారా జూలై 31లోపు నమోదు చేసుకోవాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ, సాధికారత అధికారి బి.శాంతిశ్రీ తెలిపా రు. అవార్డు కోసం అర్హులైన బాలలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.

వైఎస్సార్‌సీపీ నిరసన

కార్యక్రమం వాయిదా

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): అహ్మదాబాద్‌లో జరిగిన విషాదకర విమాన ప్రమాదం నేపథ్యంలో, శుక్రవారం శ్రీకాకుళం పట్టణంలో ని కలెక్టరేట్‌ వద్ద తలపెట్టిన నిరుద్యోగ భృతి, ఫీజు బకాయిలపై నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేశామని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ తెలిపారు. విద్యార్థులు, యువత సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన ఈ కార్యక్రమం తాత్కాలికంగా ఆపిన ట్లు తెలిపారు. కొత్త తేదీ త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. విషాద ఘటన నేపథ్యంలో బాధిత కుటుంబాలకు గౌరవం తెలుపుతూ నిరసనను వాయిదా వేయాలని నిర్ణయించామని తెలిపారు.

సాక్షి కార్యాలయంపై దాడి హేయం

వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్‌

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): టీడీపీ నాయకులు సాక్షి కార్యాలయంలోకి చొరబడి దాడి చేయడం హేయమైన చర్య అని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎంవీ స్వరూప్‌ మండిపడ్డారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభు త్వం అధికారంలోకి వస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. పత్రికలపై దాడు లు, పార్టీ నాయకులపై వేధింపులకు పాల్పడి గొంతు నొక్కాలని చూడడం సరికాదన్నారు.

నవోదయ 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు 1
1/1

నవోదయ 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement