
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలి
పాతపట్నం: జిల్లాలోని పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించి, పనులను పూర్తి చే యాలని భారత కమ్యూనిస్టు పార్టీ(సీపీఐ) జాతీయ కార్యదర్శి కె.నారాయణ అన్నారు. పాతపట్నం బాలాజీ నగర్లో ఉన్న ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో గురువారం సీపీఐ జిల్లా 25వ మహాసభలు ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు, విద్యార్థులు, యువకులు అనేక సమస్యలు ఎదుర్కొంటు న్నారని తెలిపారు. పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ గిరిజనులు పండించే పంటకు గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ కోటేశ్వరరావు, సనపల నర్సింహులు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కొ న్న శ్రీనివాసరావు, మండల కార్యదర్శి దూసి శారద, దూసి భాస్కరరావు, నాయకులు ఆదినారాయణ ఆచారి, మోహనరావు, సింహాచలం, కార్యకర్తలు పాల్గొన్నారు.
సీపీఐ శ్రీకాకుళం జిల్లా కార్యవర్గం ఎన్నిక
సీపీఐ జిల్లా కార్యదర్శిగా చాపర వెంకటరమణ, అదనపు కార్యదర్శిగా లండ వెంకటరావు, కార్యవర్గ సభ్యులుగా చాపర సుందర లాల్, పలింగ నారాయణ స్వామి, పుక్కల్ల ఆరెల్లమ్మ, కే.సంతోష్ కుమార్లను ఏక్రగీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర సహాయ కార్యవర్గ సభ్యులు తెలిపారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ