
ఉత్సాహంగా జిల్లా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లాస్థాయి సీనియర్స్ అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక పోటీలు సోమవారం జరిగాయి. ఏపీ అథ్లెటిక్స్ అసోసియేషన్ చైర్మన్ కొన్న వెంకటేశ్వరరావు (వాసు), అథ్లెటిక్స్ అసోసియేషన్ ఏపీ రాష్ట్ర, జిల్లా అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు ఆధ్వర్యంలో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్)కళాశాల మైదానంలో నిర్వహించిన ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. ఎంపికలకు హాజరైన అథ్లెట్స్కు 100, 200, 400, 800, 1600 మీటర్ల పరుగు పందాలు, 5కేఎం వాక్, రన్, లాంగ్జంప్, హైజంప్, షాట్పుట్, జావెలిన్త్రో, హేమర్త్రో వంటి అథ్లెటిక్స్ ఈవెంట్స్ జరిగాయి.
ఇక్కడ ఎంపికై న అథ్లెట్స్ను ఈ నెల 14, 15 తేదీల్లో గుంటూరులో జరిగే ఏపీ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్షిప్–2025 పోటీలకు పంపిస్తామని కొన్న మధుసూదనరావు పేర్కొన్నారు. తొలుత క్రీడాకారులకు ఎంపికల తీరుతెన్నులు, విధివిధానాలపై సంఘ నాయకులు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అథ్లెటిక్స్ సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సాంబమూర్తి, కె.హరిబాబు, కె.మాధవరావు, శ్రీనివాసరావు, పద్మలోచన, పీడీలు, పీఈటీలు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు.