
రోడ్డెక్కిన ఎండీయూ ఆపరేటర్లు
శ్రీకాకుళం పాతబస్టాండ్: రేషన్ బియ్యంను ఇంటింటికీ అందజేసే ఎండీయూ వ్యవస్థ రద్దు చేయడం ద్వారా రాష్ట్రంలో 20 వేల కుటుంబాలు రోడ్డున పడతాయని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసు కోవాలని ఎండీయూ ఆపరేటర్ల రాష్ట్ర గౌరవాధ్యక్షు డు రౌతు సూర్యనారాయణ, ట్రేడ్ యూనియన్ జేఏసీ నాయకులు తిరుపతిరావు కోరారు. శ్రీకాకుళంలోని ఎన్జీఓ హోం నుంచి జిల్లా పరిషత్ వరకు సోమవారం ఎండీయూ ఆపరేటర్లు ర్యాలీ నిర్వహించారు. తమను విధుల్లోకి తీసుకోవాలని అగ్రిమెంట్ ఉన్నప్పటికీ ఇలా తొలగించడం తగదన్నారు. జూన్ 1 నుంచి 8 వతేదీ వరకు దాదాపు 4622 బస్తాల బియ్యం పక్కదారి పట్టిందని, దానిపై ఏం చర్య తీసుకున్నారో చెప్పాలన్నారు. తమ బకాయిలు వెంటనే చెల్లించాలని కోరారు. ‘ఎండీయూ వ్యవస్థను మీరు రద్దు చేశారు.. సమయం వచ్చినప్పుడు మా 18500 కుటుంబాల సత్తా ఏమిటో చూపిస్తాం’ అని హెచ్చరించారు. వరదల్లో, వానల్లో, అమరావతి శంకుస్థాపనల్లో రేయింబవళ్లు పనిచేసిన తమకు ప్ర భుత్వం ఈ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ వరదల్లో రోజుకు రూ.1500 ఇస్తామని చెప్పి చేతులెత్తేశారన్నారు. 15వ తేదీలోగా సానుకూల నిర్ణయం రాకపోతే.. అన్ని జిల్లాల కలెక్టరేట్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా ఎండీయూ మండల ప్రెసిడెంట్ వరాహ నరసింహులు, వాసు, గోపి, హేమంత్, నవీన్, శ్రీనివాస్, వెంకట్రావు, జానకి రావు, మోహన్, సంతోష్, వెంకట్, బాలకష్ణ, అప్పలనాయుడు, రవి, కేంబూరు అప్పలనాయుడు, అనిల్, రామారావు, కుమార్, దాసు, దీనబంధు, ఉమామహేశ్వరరావు, కష్ణ, ప్రసాద్, గోవిందరాజులు, కిల్లి మోహన్, నాగేశ్వరరావు, జిల్లావ్యాప్తంగా ఉన్న ఎండీయూ ఆపరేటర్లు తదితరులు పాల్గొన్నారు.